1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By chitra
Last Updated : బుధవారం, 5 అక్టోబరు 2016 (12:14 IST)

కేజ్రీవాల్‌కు చేదు అనుభవం: సిరా దాడి... ఇంకు పోసిన వాళ్లను దేవుడు ఆశీర్వదించాలంటూ కామెంట్స్

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు చేదు అనుభవం ఎదురైంది. సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై మరోసారి ఇంకు దాడి జరిగింది. ఈ ఘటన రాజస్థాన్‌లోని బికనూర్‌లో చోటుచేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన స్థానిక న

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు చేదు అనుభవం ఎదురైంది. సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై మరోసారి ఇంకు దాడి జరిగింది. ఈ ఘటన రాజస్థాన్‌లోని బికనూర్‌లో చోటుచేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన స్థానిక నేత కుటుంబాన్నిపరామర్శించేందుకు కేజ్రీవాల్ ఇటీవల రాజస్థాన్‌కు వెళ్లారు. ఆసమయంలో ఈ ఘటన జరిగింది. ఆ వివరాలను పరిశీలిస్తే... రాజస్థాన్ పర్యటనలో ఉన్న అరవింద్ కేజ్రీవాల్‌‌పై బికనీర్‌‌లో ఏబీవీపీకి చెందిన దీనేష్ ఓఝా అనే యువకుడు ఇంకుతో దాడి చేశాడు.
 
ఆప్‌కు చెందిన స్థానిక నేత శంకర్ సేవాదాస్ కుటుంబాన్నిపరామర్శించేందుకు అరవింద్ కేజ్రీవాల్ వెళ్లారు. ఈ సందర్భంగా రాత్రి 10 గంటల సమయంలో అతని నివాసం నుంచి బయటకు వస్తుండగా దినేష్ ఓఝా, కేజ్రీవాల్‌ను జాతి వ్యతిరేకి అని ఆరోపిస్తూ, ఆయన ముఖంపై ఇంకుతో దాడి చేశాడు. దీంతో పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయంపై ట్వీట్ చేసిన కేజ్రీవాల్ 'నా మీద ఇంకు పోసిన వాళ్లను దేవుడు ఆశీర్వదించా'లని కోరారు.
 
వారి క్షేమాన్నే నేను కొరుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు. సర్జికల్ దాడుల వీడియో బయటపెట్టాలని కేజ్రీవాల్ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ దాడి జరిగినట్టు భావిస్తుండగా, బీజేపీ ఇలాంటి కుటిల యత్నాలు మానుకోవాలని ఆప్ నేతలు సూచిస్తున్నారు. విద్యార్థి విభాగం ఏబీవీపీకి చెందిన దినేష్ ఓజాగా గుర్తించారు. కాగా ఈ ఏడాది జనవరి నెలలో ఆమ్‌ఆద్మీ పార్టీ నుంచి చీలిపోయిన ఓ వర్గానికి చెందిన మహిళ ఢిల్లీలోని ఛత్రసాపాల్ మైదానంలో కేజ్రీవాల్‌పై ఇంక్‌తో దాడిచేసిన విషయం తెలిసిందే.