ముహూర్తం సమయంలో బ్లాకౌట్ - మొబైల్ లైట్ల వెలుగులో పెళ్లి!!
దేశ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కొన్ని సందర్భాల్లో సాధారణ జీనజీవనంపై ఊహించని ప్రభావం చూపుతాయి. అలాంటి ఓ సంఘటన రాజస్థాన్లో చోటుచేసుకుంది. భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తలు పెరుగుతున్న తరుణంలో ముందుజాగ్రత్త చర్యగా సరిహద్దు జిల్లాల్లో గురువారం రాత్రిపూట విద్యుత్ సరఫరాను పూర్తి నిలిపివేశారు. వైమానిక దాడుల నుంచి ప్రజలను కాపాడేందుకు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇదేసమయంలో జోధ్పూర్లోని పావ్టా ప్రాంతంలో ఓ వివాహం వేడుక జరుగుతోంది. కీలకమైన సప్తపది ఘట్టం ఆరంభమయ్యే సమయానికి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అంతా అధికారంలోకి జారుకుంది. ఈ ఊహించని పరిణామంతో పెళ్లి మండపంలో కాసేపు గందరగోళం నెలకొన్నప్పటికీ, పెళ్ళికి హాజరైన అతిథులు వెంటనే తేరుకున్నారు. తమ వద్దవున్న సెల్ఫోన్ లైట్లను ఆన్చేసి ఆ వెలుగులోనే వధువరూలతో ఏడడుగులు నడిపించారు. అనంతరం పురోహితుడు అదే మొబైల్ కాంతుల మధ్య మంత్రోచ్ఛారణ చేస్తూ మిగిలిన వివాహ క్రతువులను పూర్తి చేయించారు.
ఈ సందర్భంగా వరుడు కుటుంబ సభ్యులు మాట్లాడుతూ, పెళ్లి తంతు కంటే దేశ భద్రతే తమకు అత్యంత ముఖ్యమని స్పష్టం చేశారు. క్లిష్టపరిస్థితుల్లనూ సంయమనం పాటిస్తూ అధికారుల సూచనలకు అనుగుణంగా వివాహాన్ని పూర్తి చేసుకోవడం విశేషం. ఈ ఘటన దేశ భద్రత పట్ల పౌరులున్న బాధ్యతను సహకారాన్ని తెలియజేస్తోంది.