1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 9 అక్టోబరు 2021 (17:34 IST)

జల్సా కోసం ఓ ప్రేమ జంట చోరీల బాట.. ఓనర్స్‌ను ఏమార్చి..?

జల్సా కోసం ఓ ప్రేమ జంట చోరీల బాట పట్టింది. ఇల్లు అద్దెకు కావాలంటూ వచ్చి.. ఓనర్స్‌ను ఏమార్చి.. ఆ ఇంట్లోని విలువైన వస్తువులు దొంగిలించేవారు.  కర్ణాటక బెంగళూరులో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ జంట దొంగతనాన్ని పోలీసులు ఛేదించారు. అద్దెకు ఇల్లు కావాలని వస్తూ చోరీలు చేసే ప్రేమజంటను వినయ్, కీర్తనగా గుర్తించారు పోలీసులు. వీరిద్దరికీ 3 సంవత్సరాల క్రితం పరిచయమైంది. 
 
వినయ్​పై ఓ హత్య కేసుతో పాటు.. పలు క్రిమినల్ కేసుల్లో నిందితుడని.. ఇప్పటికే రౌడీషీట్ ఉందని పోలీసులు తెలిపారు. అయితే వినయ్ రౌడీషీటర్ అని తెలిసినప్పటికీ.. అతడిని లవ్ చేస్తున్నట్లు పోలీసులకు వెల్లడించింది కీర్తన. ఈ క్రమంలోనే అక్టోబర్ 4న మారుతీనగర్‌లోని ఓ ఇంటికి వెళ్లిన ఈ క్రైమ్ కపుల్.. ప్రైవేట్ కంపెనీ ఎంప్లాయిస్‌గా పరిచయం చేసుకొని ఇల్లు అద్దెకు కావాలని నాటకం ఆడారు. 
 
అనంతరం ఓనర్ దృష్టిని మరల్చి ఒక మొబైల్​ఫోన్, ల్యాప్​టాప్, రూ.15 వేల నగదును దొంగిలించారు. తమ ఇంట్లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి ఓనర్ ఇంటి అద్దెకోసం వచ్చిన జంట దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించి.. చంద్ర లేఅవుట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రేమజంటను అదుపులోకి తీసుకున్నారు.