శుక్రవారం, 18 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 30 సెప్టెంబరు 2021 (16:02 IST)

ఇద్దరు పిల్లలతో బ్యాంకుకు వచ్చిన మహిళ బ్యాంకులో చోరీ...

ఏపీ ఆర్థిక రాజధానిగా ఉన్న విజయవాడ గన్నవరం ఆంధ్రా బ్యాంకులో తాజాగా చోరీజరిగింది. ఇద్దరు పిల్లలతో కలిసి బ్యాంకుకు వచ్చిన ఓ మహిళ బ్యాంకులో చోరీ చేసి పారిపోయింది. ఈ చోరీకి పాల్పడిన మహిళ వివరాలను సీసీ పుటేజ్ ఆధారంగా స్థానిక పోలీసులు సేకరిస్తున్నారు. 
 
గురువారం ఉదయం ఇద్దరు పిల్లలతో ఓ మహిళ బ్యాంకుకు వచ్చింది. ఈ క్రమంలోనే బ్యాంకుకు వచ్చిన వేరే మహిళ బ్యాగు నుంచి 65 వేల రూపాయల డబ్బును కాజేసి ఇద్దరు పిల్లలతో కలిసి పరారైంది. గన్నవరం పోలీస్ స్టేషన్‌లో బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.