రైల్వే క్రాసింగ్ దాటేందుకు బైక్ ఎత్తిన బాహుబలి - వీడియో వైరల్
ఢిల్లీ వద్ద ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. రైలు వస్తుండటంతో గేట్ మ్యాన్ గేటును మూసివేశారు. అయితే, రైలు వెళ్లేంత వరకు వేచి చూడలేని ఓ యువకుడు బైకు మోసుకుంటూ గేటుదాటాడు. ఇది చూసిన మిగిలిన వాహనదారులు నివ్వెర పోయారు. రైల్వే క్రాసింగ్ దాటేందుకు బైకు ఎత్తిన యువకుడుని అభినవ బాహుబలిగా అభివర్ణించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఢిల్లీలో రైలు వస్తుండటంతో రైలు గేటును క్లోజ్ చేశారు. అంతలో అటుగా వచ్చిన ఓ బైక్ వాలా రైలు వచ్చేంత వరకు వేచి చూడటం సమయం వృథా అనుకున్నాడు. వెంటనే బైకును భుజానికి ఎత్తుకుని రైల్వే గేటు దాటాడు. ఈ దృశ్యాన్ని చూసిన ఇతర వాహనదారులు బిత్తరపోయారు. బైకును మోసుకుంటూ బాహుబలిలా నడుచుకుంటూ వెళ్లిపోయాడు. సోషల్ మీడియాలో ఈ వీడియో ఇపుడు వైరల్ అయింది.