శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 19 మే 2021 (15:48 IST)

మామతో శృంగార రాసలీల: భర్తకి కరెంట్ షాకిచ్చి చంపేసిన భార్య

భర్త పచ్చి తాగుబోతు. పెళ్లయిన దగ్గర్నుంచి ఒక్కసారి కూడా సంసారం చేసిన పరిస్థితి లేదు. ప్రతిరోజూ పూటుగా మద్యం సేవించడం ఇంటికి వచ్చి భార్యపై దాడి చేయడం. భర్త ప్రవర్తనకు విసిగిపోయింది ఆ ఇల్లాలు. ఐతే కొడుకును సరైన దారిలో పెట్టి వారి సంసారాన్ని చక్కదిద్దాల్సిన మామ, కోడలిపై కన్నేశాడు. కొడుకు తాగుబోతు కావడంతో దాన్ని ఆసరాగా చేసుకుని కోడలిని లొంగదీసుకున్నాడు. కొడుకు అలా బయటకు వెళ్లగానే కోడలితో శృంగారంలో మునిగిపోయేవాడు.
 
వివరాల్లోకి వెళితే... రాజస్థాన్ లోని జైసల్మీర్ నాచ్నా అస్కాంద్ర గ్రామంలో ముకేష్ కుమార్ తన కొడుకు-కోడలితో వుంటున్నాడు. ఐతే తన కొడుకు పెద్ద తాగుబోతు. భార్యను పట్టించుకునే వాడు కాదు. పెళ్లి జరిగిన రోజు నుంచి ఇదే తంతు. ఈ క్రమంలో మామ ముకేష్ కన్ను కోడలు పార్లేపై పడింది. ఓ రోజు ఆమెను లొంగదీసుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఎంజాయ్ చేయడం మొదలుపెట్టారు. ఐతే తన కుమారుడు అడ్డు తొలగించుకుంటే ఇక తమ ఆనందానికి అడ్డే లేదని కోడలికి ప్లాన్ చెప్పాడు మామ.
 
దాంతో ఆమె నిమ్మరసంలో మత్తుబిళ్లలు వేసింది. ఇంటికి వచ్చాక అతడికి ఇవ్వడంతో దాన్ని తాగి మత్తులోకి జారుకున్నాడు. ఆ తర్వాత కరెంటు వైర్లు తీసుకుని కరెంట్ షాకిచ్చి చంపేసింది. ఆ తర్వాత తాగిన మైకంలో కరంటు తీగలు పట్టుకుని షాక్ తో చనిపోయాడని ఇరుగుపొరుగువారిని నమ్మించింది. ఆ తర్వాత వెంటనే అంత్యక్రియలు తంతు కూడా కానించేసారు. ఐతే కరెంట్ షాక్ తో వ్యక్తి చనియాడన్న సమాచారంతో పోలీసులు ఇంటికి వచ్చి తమదైన శైలిలో విచారణ చేసారు. వారి విచారణలో అసలు నిజం బయటపడింది.