మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 12 డిశెంబరు 2021 (14:10 IST)

హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర అగ్నిప్రమాదం... గోశాలలు దగ్ధం

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఆదివారం ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఏకంగా 27 పూరి గుడిసెలు, 26 గోశాలలు అగ్నికి ఆహుతయ్యాయి. రెండు దేవాలయాలకు మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదం మజాణ్ గ్రామంలోజరిగింది. 
 
ఈ అగ్నిప్రమాదంపై ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ స్పందించారు. ఈ ప్రమాదం పట్ల ఆయన దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నట్టు చెప్పారు. బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పారు. 
 
పూరి గుడిసెల్లో నుంచి మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. దీంతో పక్కనే ఉన్న గోశాలలుకూ ఈ మంటలు వ్యాపించాయి. దీంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నిప్రమాద బాధితులను ఆదుకుంటామని ఆయన చెప్పారు.