శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 19 మే 2020 (20:40 IST)

ఎంజీ మోటార్ ఇండియా, ఎంజీ నర్చర్ ప్రోగ్రామ్ ద్వారా 200 మంది విద్యార్థులకు శిక్షణ

సమాజానికి విస్తృతంగా సేవ చేయాలన్న తన నిబద్ధతను మరింత విస్తరిస్తూ, ఎంజీ మోటార్ ఇండియా విద్యార్థులకు శిక్షణ ఇవ్వడంపై దృష్టి సారించింది. మొట్టమొదటిగా విద్యార్థి సహాయ కార్యక్రమమైన ఎంజీ నర్చర్ ప్రోగ్రామ్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా సుమారు 200 మంది విద్యార్థులను మార్కెట్-కేంద్రీకృత నైపుణ్యంతో సిద్ధం చేస్తుంది.
 
ఫలితంగా వారికి భవిష్యత్తు సంసిద్ధతను అందిస్తుంది. ఇలాంటి పరీక్షా సమయంలో, పొడిగించబడిన లాక్ డౌన్ సమయంలో, ఎంజీ మోటార్ ఇండియా యొక్క ఉపక్రమం ఏమిటంటే విద్యార్థి విభాగానికి నైపుణ్యాలను అందించడం, తద్వారా భవిష్యత్తులో వారి వృత్తిపరమైన అవకాశాలను మెరుగుపరచడం. ఇందుకు ప్రతిగా, కార్ల తయారీదారు దేశ యువత యొక్క సృజనాత్మక మరియు వినూత్న ఆలోచనల నుండి కూడా ప్రయోజనం పొందుతారు. 
 
ఎంజీ నర్చర్ ప్రోగ్రాం కోసం స్క్రీనింగ్ పరీక్ష కోసం కాలేజ్ దేఖో అనేది ఎకోసిస్టమ్ తోడ్పాటును అందిస్తుంది. ఇది పరిశ్రమ-మొట్టమొదటి, రోబోటిక్ ఎంపిక ప్రక్రియను కలిగి ఉంటుంది. దీనికి మరొక స్టార్ట్-అప్ కంపెనీ ఇవ్యూమి అనేది సహాయం చేస్తుంది. ఈ కార్యక్రమానికి ఉన్నత అధ్యయనాలకు కొన్ని ఉపకారవేతనాలను అందించే ప్రత్యేక ఆకర్షణ కూడా కలిగి ఉంది.
 
ఎంజీ మోటార్ ఇండియా ప్రెసిడెంట్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ చాబా మాట్లాడుతూ, “ఈ సమయంలో, ఎంజీ నర్చర్ కార్యక్రమం విద్యార్థులను చేరుకోవడానికి, మార్కెట్ కోసం భవిష్యత్తులో సిద్ధంగా ఉండటానికి వారిని బలోపేతం చేయడానికి తోడ్పడుతుంది. ఈ కార్యక్రమం జూన్ నుండి ఎనిమిది వారాల పాటు ప్రారంభమవుతుంది. ఆ తరువాత కొంతమంది ప్రతిభావంత విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలను కల్పించడం గురించి కూడా పరిశీలిస్తాము.”