బుధవారం, 19 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 30 ఆగస్టు 2016 (10:40 IST)

16 యేళ్ళ బాలుడిపై 23 యేళ్ల మహిళ అత్యాచారం... ఆపై వీడియో షూట్

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ సంచలన కేసు నమోదైంది. 16 యేళ్ళ మైనర్ బాలుడిపై 23 యేళ్ల మహిళ అత్యాచారానికి పాల్పడింది. అత్యాచారం చేయడమేకాకుండా, తనను పెళ్లి చేసుకోవాలని కూడా ఆ మహిళ ఒత్తిడి చేసింది.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ సంచలన కేసు నమోదైంది. 16 యేళ్ళ మైనర్ బాలుడిపై 23 యేళ్ల మహిళ అత్యాచారానికి పాల్పడింది. అత్యాచారం చేయడమేకాకుండా, తనను పెళ్లి చేసుకోవాలని కూడా ఆ మహిళ ఒత్తిడి చేసింది. దీంతో ఆ మహిళపై బాలల లైంగిక నేరాల నిరోధక చట్టం (పోస్కో) సెక్షన్ 7, 8లు, ఐపీసీ 386 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ తరహా కేసు యూపీలో నమోదు కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ కేసు వివరాలను పరిశీలిస్తే... 
 
సహరాన్ పూర్ పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... 16 ఏళ్ల మైనర్ బాలుడిపై 23 ఏళ్ల మహిళ అత్యాచారం చేసింది. దీన్నంతా వీడియోగా తీసింది. ఆ తర్వాత తనను పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి చేసింది. ఈ వీడియోను చూపించి బాలుడిపై పలుసార్లు లైంగికంగా వేధించిందని పోలీసులు చెప్పారు. తనను పెళ్లి చేసుకోకుంటే బాలుడితో గడిపిన వీడియో క్లిప్పింగును సోషల్‌ మీడియాలో పెడతానని మహిళ మైనర్ బాలుడిని బెదిరించిందని పోలీసులు తెలిపారు. 
 
ముందు బాధిత బాలుడి సోదరుడు మహిళ అత్యాచారం జరిపిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా, నిందితురాలు మహిళ కావడంతో పోలీసులు కేసు నమోదు చేయలేదు. దీంతో బాలుడి కుటుంబసభ్యులు కోర్టును ఆశ్రయించారు. దీంతో మహిళపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. కోర్టు ఆదేశాల ప్రకారం మహిళపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని సహరాన్ పూర్ స్టేషను ఆఫీసర్ పీయూష్ దీక్షిత్ చెప్పారు. మొత్తంమీద ఈ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది.