1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 20 జూన్ 2021 (13:30 IST)

లాక్డౌన్ ఎఫెక్టు : మెట్రోలో కోతుల ప్రయాణం

లాక్డౌన్ కారణంగా అనేక మూగ జీవులు ఆహారం కోసం జనావాస ప్రాంతాలకు వస్తున్నాయి. ఇక కోతుల సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సాధారణ రోజుల్లోనే ఈ కోతులు జనావాస ప్రాంతాల్లోకి వస్తుంటాయి. తాజాగా ఓ కోతి మెట్రోరైలులో ప్రయాణించింది. ఇది ఢిల్లీలోని యమునా బ్యాంక్ స్టేషన్ మార్గంలో చోటుచేసుకుంది. 
 
రైల్లో హుషారుగా అటూ ఇటూ తిరుగుతూ క‌నిపించింది. మొదట అటూ ఇటూ కలిగియ దిరిగిన వానరం తర్వాత ఓ ప్రయాణికుడి వద్ద సీటుపై కూర్చుంది. ట్రైన్‌ వెళ్తుండగా అద్దాల్లోంచి పరిసరాలను గమనిస్తూ వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 
 
అయితే, మెట్రో రైలులో కోతి ప్రయాణించిన విషయాన్ని ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ అధికారులు మాత్రం ధ్రువీకరించలేదు. ఇంతకుముందు సైతం ఢిల్లీలో ఒకసారి మెట్రోలో కోతి ప్రయాణించింది. మ‌నుషుల‌కు హాని చేస్తే ప‌రిస్థితి ఏంట‌ని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.