శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 8 ఫిబ్రవరి 2021 (12:52 IST)

ముంబై: పెట్రోల్ పోసి నిప్పెట్టిన ప్రియుడు.. గట్టిగా హత్తుకున్న ప్రియురాలు.. చివరికి ఏమైందంటే?

ముంబైలో తనను హతమార్చాలని ప్లాన్ చేసిన ప్రియుడి ప్రాణాలు తీసింది. ప్రియురాలికి నిప్పంటించిన ప్రియుడికి షాక్ తప్పలేదు. నిప్పుకు ఆహుతి అవుతూనే ఆ ప్రియురాలు.. ప్రియుడిని గట్టిగా హత్తుకుంది. అంతే అతడు కూడా మంటల్లో చిక్కుకున్నాడు. చివరికి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. 30 ఏళ్ల వ్యక్తి తన ప్రేయసిని నిప్పంటించి చంపడానికి ప్రయత్నించాడు. 
 
అలా ఆ మహిళ తనకు నిప్పంటుకున్నా.. అకస్మాత్తుగా ప్రియుడి వైపుకు వెళ్లి, అతనిని గట్టిగా పట్టుకుంది, ఇది అతని మరణానికి దారితీసింది. ఈ సంఘటనలో 80 శాతం తీవ్రగాయాలకు గురైన మహిళ ప్రస్తుతం చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ముంబై గాంధీ నగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.  బాధితురాలికి నిప్పించిన ప్రియుడు అలా నిప్పుకే ఆహుతి కావడం స్థానికంగా కలకలం రేపింది. బాధితురాలు ఇంటి తలుపు వద్ద నిల్చుని.. సహాయం కోసం అరిచిన అరుపులు భయానకాన్ని సృష్టించాయి.
 
మరణించిన విజయ్ ఖంబే అనే వ్యక్తి గత రెండున్నరేళ్లుగా బాధితురాలితో సంబంధం కలిగివున్నాడు. ఇంకా ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నాడు. ఆమె తల్లిదండ్రులకు వివాహ ప్రతిపాదన పంపాడు. కాని వారు దానిని తిరస్కరించారు. తరువాత, బాధితురాలు కూడా అతనిని వివాహం చేసుకోవడానికి నిరాకరించింది. ఎందుకంటే బాధితురాలికి తన ప్రియుడు మద్యపానానికి వ్యసనం కావడం ఇష్టం లేదు. 
 
దీంతో ఆవేశానికి గురైన విజయ్.. ప్రియురాలు ఇంట్లో ఒంటరిగా ఉందనే విషయాన్ని సద్వినియోగం చేసుకొని ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడని ఒక పోలీసు అధికారి తెలిపారు. ఆమె మంటల్లో చిక్కుకుని సహాయం కోసం అరుస్తూ ఉండగా, నిందితుడు తలుపు వద్ద నిల్చుని చూస్తూ ఉన్నాడు. దీంతో బాధితురాలు తలుపు వైపు పరుగెత్తి, అతన్ని పట్టుకుని అతనిని గట్టిగా పట్టుకుంది.
 
నిందితుడు తనను కాపాడుకోవడానికి తన వంతు ప్రయత్నం చేశాడని.. ఇరుగుపొరుగు వారి సాయంతో మంటలు ఆర్పినా.. ప్రయోజనం లేకపోయిందని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఇద్దరినీ సమీప ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఖంబే 90 శాతం కాలిన గాయాలతో జెజె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. అయితే, బాధితురాలి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్తున్నారు. ఈ ఘటనపై బాధితుడి సోదరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.