గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 3 డిశెంబరు 2019 (12:44 IST)

చనువుగా మాట్లాడుతోందనీ చెంప ఛెళ్లుమనిపించిన ప్రియుడు... ప్రాణాలు విడిచిన మహిళ

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో దారుణం జరిగింది. తన ప్రియురాలు మరో వ్యక్తితో చనువుగా మాట్లాడటాన్ని ఓ ప్రియుడు జీర్ణించుకోలేక పోయాడు. ఈ విషయాన్ని ఆమెకు పలుమార్లు చెప్పాడు. అయినా ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. ఈ నేపథ్యంలో మరో వ్యక్తితో మాట్లాడుతున్న ప్రియురాలిని చూసి ఆగ్రహంతో ఊగిపోయిన ప్రియుడు.. ఆమె చెంప ఛెళ్ళుమనిపించాడు. అంతే... ఆమె అక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ముంబైలోని మాన్ ఖుర్ద్ రైల్వే స్టేషన్‌కు సమీపంలోని ప్రాంతానికి చెందిన సీతా ప్రధాన్ (35) అనే మహిళకు బాయ్‌ఫ్రెండ్ రాజు పూజారీ అనే వ్యక్తివున్నాడు. అయితే, ఈమె మరో వ్యక్తితో చనువుగా ఉంటుంది. ఈ క్రమంలో ఇటీవల ఆ వ్యక్తితో చనువుగా మాట్లాడుతుండటాన్ని బాయ్‌ఫ్రెండ్ చూశాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయాడు. వెంటనే సీతా ప్రధాన్ చెంపఛెళ్లుమనింపించాడు. 
 
అంతే, ఆ మహిళ అక్కడే కుప్పకూలిపోయింది. వెంటనే ఆమెను ఘట్కోపర్‌లోని రాజావాది ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆమె మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయిందని వైద్యులు తెలిపారు. దీనిపై ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా మాన్ ఖుర్ద్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆమె శవపరీక్ష నివేదిక వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ఘటనలో రాజుని పోలీసులు అదుపులోకి తీసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.