1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 23 జూన్ 2022 (09:45 IST)

హరిద్వార్ వెళ్లి వస్తుండగా ఘోరం.. 10 మంది మృత్యువాత

road accident
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారణం జరిగింది. హరిద్వార్ వెళ్లి వస్తున్న యాత్రికుల వ్యాను ఒకటి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పది మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రమాదం ఫిలిబిత్‌లోని గజ్రౌలా పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో జరిగింది. 
 
కొంతమంది భక్తులతో హరిద్వార్ వెళ్లిన డీసీఎం వ్యాను దైవదర్శనం ముగించుకుని తిరిగి తమ సొంతూర్లకు బయలుదేరారు. డ్రైవర్‌తో సహా భక్తులంతా నిద్రమత్తులో ఉండగా వేగంగా వస్తున్న వ్యాను రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టి, హైవేపై బోల్తాపడింది. ఈ ఘటనలో పది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 
 
తీవ్రంగా గాయపడిన ఏడుగురిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మృత్తుల్లో ఎక్కువ మంది లక్నోకు చెందినవారే కావడం గమనార్హం. ప్రమాదానికి డ్రైవర్ నిద్రమత్తే కారణమని తెలుస్తుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతేదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.