శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By జె
Last Updated : గురువారం, 12 సెప్టెంబరు 2019 (15:44 IST)

భర్త నైట్ డ్యూటీ.. భార్య ఇద్దరు యువకులతో ఎంజాయ్..

రాజస్థాన్ ప్రాంతానికి చెందిన మున్నీ, ఆసిఫ్‌లకు మూడునెలల క్రితం వివాహమైంది. రాజస్థాన్‌లో పనులు దొరక్కపోవడంతో హైదరాబాద్‌లో ఉన్న తన స్నేహితులను నమ్ముకుని హైదరాబాద్‌కు వచ్చేశారు. సమీర్, గురునాథ్‌లు రామాంత పూర్‌‍లో ఒక ఇంటిని అద్దెకు తీసిచ్చారు.
 
ఆసిఫ్ రెండురోజుల పాటు ఇంటి దగ్గరే ఉన్నాయి. అయితే రాజస్థాన్ నుంచి తెచ్చుకున్న డబ్బులు అయిపోయాయి. దీంతో ఇక ఉద్యోగ వేట మొదలుపెట్టాడు. 10వతరగతి వరకు మాత్రమే చదువుకున్న ఆసిఫ్ ఆటో నడపాలని నిర్ణయించుకున్నారు.
 
సమీర్, గురునాథ్‌లను సాయం కోరాడు. సమీర్ తన స్నేహితుడి సహాయంతో రాత్రి వేళల్లో ఆటోను నడుపుకునేందుకు పర్మిషన్ తీసిచ్చాడు. దీంతో రాత్రి వేళ ఆసిఫ్ ఆటో నడపడం ప్రారంభించాడు. ఆసిఫ్ ఇంటిలో లేని సమయంలో సమీర్ అతని ఇంటికి వచ్చాడు. మున్నీతో మాటలు కలిపాడు. ఇంటికి ఏ వస్తువులు అవసరమున్నా తనకు చెప్పమని..తాను తీసుకువచ్చి ఇస్తానని చెప్పేవాడు.
 
ఇలా వారంరోజుల పాటు మున్నీ ఇంటికి రాత్రి వేళల్లోవెళ్ళేవాడు. అయితే ఒకరోజు మున్నీ చేయిపట్టుకున్నాడు. నువ్వంటే ఇష్టమన్నాడు. ఎన్నో ఇబ్బందుల్లో ఉన్న తమకు సాయం చేసిన సమీర్‌కు దగ్గరైంది మున్నీ. ఇలా ఆరునెలల పాటు గడిచింది. ఆసిఫ్ కు విషయం తెలియకుండా జాగ్రత్త పడ్డారు. అయితే ఒకరోజు సమీర్ మున్నీ ఇంటికి వెళ్ళడం చూసేశాడు. ఇంటి నుంచి బయటకు వచ్చిన సమీర్ ను బ్లాక్ మెయిల్ చేశాడు.
 
మున్నీతో నీకున్న అక్రమ సంబంధాన్ని బయటపెట్టేశానని బెదిరించాడు. మున్నీ తన కోరిక తీరిస్తే తాను చెప్పమన్నారు. దీంతో మున్నీని ఒప్పించాడు సమీర్. వారంరోజుల పాటు మున్నీతో రాత్రి వేళల్లో గడుపుతూ వచ్చాడు గురునాథ్. తన భర్తను మోసం చేస్తున్నానన్న భావన మున్నీలో కలిగింది. 
 
ఉదయం పూట పని నుంచి ఇంటికి వచ్చిన ఆసిఫ్‌కు అసలు విషయాన్ని చెప్పేసింది. ఆసిఫ్ భార్యను వెంటబెట్టుకుని రామాంతపూర్ పోలీస్టేషన్‌లో సమీర్, గురునాథ్‌లపై ఫిర్యాదు చేశారు. నిందితులిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తప్పు తెలుసుకున్న మున్నీ ఇళ్ళు ఖాళీ చేసి ఉప్పల్ లో మరొక ప్రాంతానికి వెళ్ళిపోయారు.