శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 4 జులై 2019 (09:39 IST)

రేపిస్టును కరెంట్ షాకిచ్చి చంపివేసిన మైనర్ బాలిక తండ్రి...!

మైనర్ బాలికను రేప్ చేసిన నిందితుడికి కరెంట్ షాక్ పెట్టి చంపేశారు. ఈ దారుణానికి మైనర్ బాలిక కుటుంభ సభ్యులు పాల్పడ్డారు. అత్యాచారానికి గురైన నిందితుడు జైలు శిక్ష అనుభవించి, అనంతరం బెయిల్‌పై ఇంటికి వచ్చిన నేపథ్యంలో నిందితుడిపై కక్ష తీర్చుకున్నారు.జైలు నుండి వచ్చిన వెంటనే నిందితుడి ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించి ఇతర కుటుంభ సభ్యుల మధ్యే కరెంట్ షాక్ పెట్టి చంపివేశారు. 
 
ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో జరిగిం. సాధిక్ అనే 22 సంవత్సరాల యువకుడు అదే ప్రాంతానికి చెందిన ఓ మైనర్ బాలికను అత్యాచారం చేశాడు. దీంతో సాధిక్‌పై మైనర్ బాలిక అత్యాచార చట్టాలకు సంబంధించి పోస్కో కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టు పంపించారు. దీంతో రెండు నెలల పాటు జైలు శిక్ష వహించి ఇరవై రోజుల క్రితం బెయిల్‌పై విడుదల అయి ఇంటికి చేరుకున్నాడు. అయితే అత్యాచారానికి గురి చేసిన యువకుడిపై కక్షను పెంచుకున్న బాలిక కుటుంబ సభ్యులు నిందితుడు కళ్లముందే తిరగడంతో సహించలేక పోయారు. 
 
ఈ నేపథ్యంలోనే బాలిక తండ్రితోపాటు మరో ముగ్గురు సాదిక్ ఇంటికి వెళ్లారు. అనంతంర సాధిక్‌ను ఎలాంటీ గాయాలు గురిచేయకుండా కరెంట్ షాక్ ఇచ్చారు. సాధిక్ చెల్లెలు ఇంట్లో ఉండగానే ఈ దారుణానికి పాల్పడ్డారు. దీంతో సాధిక్ అక్కడిక్కడే మృతి చెందాడు. కాగా పోలీసులు హత్యకు పాల్పడ్డ వారిపై కేసు నమోదు చేసి అదుపులో తీసుకున్నారు. పోస్ట్ మార్టమ్ రిపోర్టు వచ్చిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు.