శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By జె
Last Modified: గురువారం, 27 ఆగస్టు 2020 (16:47 IST)

ప్రియుడితో అక్క ఎంజాయ్, చూసిన చెల్లెలి షాక్, ఆ తరువాత..?

ఇంట్లో తల్లిదండ్రులు లేరు. ఉన్నది అక్కాచెల్లెళ్లే. చెల్లెలు ఇంట్లో నిద్రపోతోంది. దీంతో అక్క ప్రియుడిని ఇంటికి పిలిపించుకుంది. రాత్రంతా ఎంజాయ్ చేద్దామనుకుంది. అయితే చెల్లి ఉన్నట్లుండి నిద్ర లేచి బయటకు వచ్చి చూసింది. అక్క రాసలీలల్లో ఉండటంతో షాక్‌కు గురైంది. దీంతో తన గుట్టు ఎక్కడ బయటపెడుతుందోనని ఆమెను ప్రియుడితో కలిసి చంపేసింది అక్క.
 
చత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని కట్ఘొరాలోని ఒక బ్యాంక్ రీజనల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు వినయ్. మల్దా గ్రామంలో నివాసముండే రాజాసింగ్ బ్యాంక్‌లో లోన్ తీసుకున్నాడు. ప్రతినెలా లోన్‌కు సంబంధించిన డబ్బులను వసూలు చేసేందుకు వినయ్ వారి ఇంటికి వెళ్ళేవాడు.
 
గ్రామం కావడంతో మేనేజర్‌ను ఆప్యాయంగా ఇంట్లో కూర్చోబెట్టి మర్యాదలు చేసేవారు. ఇలా వినయ్.. రాజాసింగ్ పెద్దకుమార్తెను చూశాడు. ఆమెపై కన్నేశాడు. ఎలాగైనా ఆమెను తనవైపు తిప్పుకోవాలనుకున్నాడు. ఆమె నెంబర్‌ను కనుక్కుని మాటల్లో దింపాడు. 
 
అలా అలా వారిద్దరి మధ్య పరిచయం కాస్త శారీరక సంబంధానికి దారితీసింది. రాజాసింగ్ బంధువుల పెళ్ళి ఉండటంతో భార్యాభర్తలు మాత్రమే ఆ పెళ్ళికి వెళ్ళారు. తమ ఇద్దరు కూతుళ్లను ఇంట్లోనే వదిలేసి వెళ్ళిపోయారు. అక్క, చెల్లెలికి వేర్వేరు గదులు ఉండటంతో చెల్లెలు వెళ్ళి పడుకొని నిద్ర పోయింది.
 
చెల్లెలు నిద్రపోయిందని ప్రియుడికి ఫోన్ చేసింది అక్క. అతడు రాగానే ఇద్దరూ కలిసి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. రాత్రంతా ఎంజాయ్ చేయొచ్చని అనుకుంది అక్క. అయితే ఉన్నట్లుండి చెల్లెలికి మెళకువ రావడం.. బయటకు వచ్చి చూడడం... అక్క వేరొక వ్యక్తితో ఉండటంతో షాకైంది.
 
విషయం తండ్రికి ఎక్కడ చెప్పేస్తోందనని భయపడిన అక్క, తన ప్రియుడితో కలిసి చెల్లెలిని అతి దారుణంగా చంపేసింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి రాగానే సెల్ ఫోన్ ఇవ్వలేదని చంపేసినట్లు పోలీసుల విచారణలో తెలిపింది.
 
అయితే ఆమె మాటలను పోలీసులు నమ్మకపోవడం.. తిరిగి తిరిగి విచారించడంతో అసలు విషయం చెప్పింది. దీంతో వినయ్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.