1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 18 డిశెంబరు 2021 (08:38 IST)

సీఎం ఎంకే స్టాలిన్ కీలక ఆదేశాలు: అధికారిక గీతంగా తమిళ్ తాయ్ వాళ్తు

తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. మనోన్మనియం సుందరం పిళ్లై రచించిన 'తమిళ్‌ తాయ్‌ వాళ్తు'ను రాష్ట్ర అధికారిక గీతంగా ప్రభుత్వం ప్రకటించింది తమిళ సర్కారు. రాష్ట్రంలో జరిగే అన్ని కార్యక్రమాల్లో ఈ గీతాన్ని తప్పనిసరిగా ఆలపించాలని శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. 
 
55 నిమిషాల నిడివితో కూడిన ఈ గీతాన్ని రికార్డింగ్‌ రూపంలో కాకుండా శిక్షణ పొందిన వారి ద్వారా పాడించాలని సూచించింది. అలాగే ఈ గీతం ఆలపించే సమయంలో అందరూ తప్పనిసరిగా లేచి నిలబడాల్సిందేనని స్పష్టం చేసింది. అయితే దివ్యాంగులకు మాత్రం మినహాయింపు కల్పించారు. 
 
ప్రమాదాల బారిన పడ్డ వారికి తక్షణ వైద్య సేవల నిమిత్తం ప్రాణ రక్షణ పథకానికి ప్రభుత్వం నిర్ణయించింది. శనివారం చెంగల్పట్టు జిల్లా మేల్‌ మరువత్తూరులో జరిగే కార్యక్రమంలో ఈ పథకానికి సీఎం ఎంకే స్టాలిన్‌ శ్రీకారం చుట్టనున్నారు.