1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
  4. Tamil Nadu Reports First Case Of Omicron After Returnee From Nigeria Tests Positive

తమిళనాడులో తొలి ఒమిక్రాన్ కేసు నమోదు.. కాంటాక్ట్ అయిన మరో ఏడుగురికి...

Tamil Nadu
తమిళనాడు రాష్ట్రంలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. నైజీరియా నుంచి చెన్నైకు వచ్చిన వ్యక్తికి ఈ వైరస్ సోకింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి ఎం. సుబ్రహ్మణ్యం బుధవారం రాత్రి ప్రకటించారు. అలాగే, ఆయన్ను కాంటాక్ట్ అయిన్ మరో ఏడుగురికి కూడా ఈ వైరస్ సోకివుండొచ్చన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు. 
 
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. మన దేశంలో తొలి ఒమిక్రాన్ కేసు బెంగుళూరులో వెలుగు చూసింది. ఆ తర్వాత మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లో వెలుగు చూశాయి. బుధవారం వెస్ట్ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోనూ ఈ వైరస్ వెలుగు చూసింది. హైదరాబాద్ నుంచి బెంగాల్‌కు వెళ్లిన ఏడేళ్ళ బాలుడికి ఈ వైరస్ సోకినట్టు తేలింది. 
 
ఈ నేపథ్యంలో తమిళనాడులో ఒమిక్రాన్ కేసు నమోదైంది. నైజీరియా నుంచి చెన్నైకు వచ్చిన ఓ రాష్ట్ర పౌరుడికి ఈ వైరస్ సోకినట్టు నిర్ధారణ అయిందని మంత్రి సుబ్రహ్మణ్యం తెలిపారు. అలాగే, ఆయన్ను కాంటాక్ట్ అయిన మరో ఏడుగురికి కూడా ఈ వైరస్ సోకివుంటన్న అనుమానం కలుగుతుందన్నారు. వారి శాంపిల్స్ సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపినట్టు ఆయన వెల్లడించారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
వాగులో పడిన ఆర్టీసీ బస్సు, ప్రధాని, సీఎం ఎక్స్‌‍గ్రేషియా ప్రకటన