శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 21 డిశెంబరు 2018 (11:03 IST)

టెక్కీతో పెళ్లి.. నెలరోజులకే టెన్త్ విద్యార్థితో ప్రైవేట్ టీచర్ లేచిపోయింది

ఆమె ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. వయసు 26 యేళ్లు. ఆమె వద్ద 15 యేళ్ల వయసున్న విద్యార్థి పదో తరగతి చదువుతున్నారు. అతనిపై టీచరమ్మ మనసు పారేసుకుంది. అయితే, ఈ విషయం ఆ విద్యార్థి, టీచరమ్మకు మాత్రమే తెలుసు. 
 
ఈ క్రమంలో టీచర్‌కు గతనెల 19వ తేదీన చెన్నైలోని ఓ ఐటీ కంపెనీలో పని చేసే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌తో వివాహం జరిపించారు. కానీ, తన మనసిచ్చిన విద్యార్థిని మాత్రం మరిచిపోలేక పోయింది. దీంతో నెల తిరగక ముందే బాలుడితో లేచిపోయింది. ఆపై పోలీసులను ఆశ్రయించి, తామిద్దరం కలిసే ఉంటామని చెప్పడంతో పోలీసులు తలలు పట్టుకున్నారు. 
 
తమిళనాడు రాష్ట్రంలోని సేలం జిల్లా తిరువాగౌండనూరుకు చెందిన ఈ టీచరమ్మ... వివాహం తర్వాత తన పుట్టింటికని వెళ్లింది. భర్త మాత్రం ఉద్యోగ నిమిత్తం చెన్నైకు వచ్చాడు. ఈ క్రమంలో ఉపాధి కల్పనా కార్యాలయానికి వెళ్లివస్తానని తల్లిదండ్రులకు చెప్పి ఇంటి నుంచి బయటకు వచ్చింది. 
 
సాయంత్రం వరకు రాకపోవడంతో పలుచోట్ల గాలించిన తల్లిదండ్రులు.. చివరకు పోలీసులను ఆశ్రయించారు. ఆ సమయంలోనే ఆ టీచరమ్మ తాను ప్రేమించిన బాలుడుతో కలిసి పోలీస్ స్టేషన్‌కు వచ్చింది. తామిద్దరం కలిసే ఉంటామని, అతన్ని వదిలిపెట్టలేనని తెగేసి చెప్పింది. ఎంత చెప్పినా వినకపోవడంతో పోలీసుల తలలు పట్టుకున్నారు.