శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 14 నవంబరు 2018 (15:43 IST)

అసలే ఓపెన్ టాప్ జీప్.. పులి వెంబడించింది.. డ్రైవర్ వేగం పెంచకపోయుంటే..?

మహారాష్ట్రలో పర్యాటకులను పులి వెంబడించిన ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా తడోబా-అంధారీ టైగర్ రిజర్వ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. అడవిలో షికారుకు వెళ్లిన పర్యాటకుల వాహనాన్ని పులి వెంబడించింది. అంతే అందులోని పర్యాటకులు భయంతో కేకలు వేశారు. 
 
వాహనానికి, పులికి మధ్య దూరం కొన్ని అడుగులు మాత్రమే ఉండడం, వాహనం ఓపెన్ టాప్ కావడంతో పర్యాటకులకు చుక్కలు కనిపించాయి. కానీ డ్రైవర్ వేగం పెంచేయడంతో పర్యాటకులు సురక్షితంగా తప్పించుకోగలిగారు.
 
ఇలాంటి ఘటనలు టైగర్ రిజర్వ్‌లో కొత్తేమీ కాదని.. పర్యాటకుల వాహనం మరీ దగ్గరగా రావడంతో మూడున్నరేళ్ల చోటీ మధు అనే పులి ఆందోళనతో వారి వాహనాన్ని వెంబడించిందని రేంజ్ ఫారెస్ట్ అధికారి రాఘవేంద్ర చెప్పారు. పులులు ఉండే ప్రదేశానికి వెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని డ్రైవర్లకు సూచించారు. ఘటనకు కారణమైన రహదారిని వారం రోజులపాటు మూసి వేస్తున్నట్టు చెప్పారు.