గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 30 జనవరి 2019 (17:07 IST)

రాహుల్‌ జీ.. ఇంత దిగజారుడు మాటలా?.. ఛీ.. ఛీ :: మనోహర్ పారికర్

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేశారు. తనను పరామర్శిచేందుకు వచ్చిన రాహుల్.. నీచ రాజకీయాల కోసం ఇంత దిగజారుడు వ్యాఖ్యలు చేస్తానని భావించలేదని ఆవేదన వ్యక్తంచేశారు. పైగా, తమ మధ్య జరిగిన ఐదు నిమిషాల భేటీలో రాఫెల్ డీల్ అంశమే చర్చకు రాలేదని చెప్పారు.
 
గత కొంతకాలంగా కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న మనోహర్ పారికర్‌ను రాహుల్ గాంధీ మంగళవారం గోవాకు వెళ్లి పరామర్శించిన విషయం తెల్సిందే. ఈ భేటీ తర్వాత రాహుల్ మాట్లాడుతూ.. ఇది కేవలం వ్యక్తిగతమని చెప్పారు. కానీ, బుధవారం ఆయన మాట మార్చారు. రాఫెల్‌ డీల్‌పై కొత్తగా చెప్పాల్సిందేమీ లేదనీ, మిత్రుడు అనిల్ అంబానీకి లబ్దిచేకూర్చేందుకే ప్రధాని నరేంద్ర మోడీ ఈ డీల్‌ను ఖరారు చేశారంటూ చెప్పారు. ఈ వ్యాఖ్యలు బీజేపీలో ప్రకంపనలు సృష్టించారు. 
 
దీంతో పారికర్ మీడియా ముందుకు వచ్చారు. రాహుల్ వ్యాఖ్యలపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేశారు. నీ రాజకీయ లబ్ధి కోసం నన్ను పరామర్శించావని తెలిసి చాలా బాధ కలుగుతుంది. అసలు 5 నిమిషాల ఆ భేటీలో రాఫెల్ అంశం మన మధ్య చర్చకు వచ్చిందా అని పారికర్ ప్రశ్నించారు.
 
ఇదే అంశంపై ఆయన ఓ లేఖను కూడా ఆయన విడుదల చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులను పరామర్శించడానికి వెళ్లి దానిని నీ స్వార్థ రాజకీయ ప్రయోజనాలకు వాడుకోకు అని రాహుల్‌కు పారికర్ సూచించారు. నిజాలను మీరే బయటపెడతారని ఆశిస్తున్నానని అన్నారు. మీరు చేసిన ఈ వ్యాఖ్యలు మీ చిత్తశుద్ధిని శంకించేలా ఉన్నాయని రాహుల్‌పై పారికర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రక్షణ శాఖ కొనుగోళ్ల విధానం ప్రకారమే రాఫెల్ డీల్ జరిగిందని మరోసారి పారికర్ స్పష్టంచేశారు.