1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 30 జనవరి 2019 (14:59 IST)

రాఫెల్‌ డీల్‌పై మనోహర్ పారీకర్ అలా అన్నారు : రాహుల్

రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నారు. ఈ ఒప్పందంలో భారీ స్థాయిలో అవినీతి చోటుచేసుకుందని ఆయన ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత అనిల్ అంబానీకి మేలు చేకూర్చేలా ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఒప్పందం ఖరారు చేశారని ఆయన ఆరోపిస్తున్నారు. 
 
గతంలో దేశ రక్షణ మంత్రిగా పనిచేసి ఇపుడు గోవా ముఖ్యమంత్రిగా ఉన్న మనోహర్ పారీకర్‌తో రాహుల్ గాంధీ మంగళవారం సమావేశమయ్యారు. వాస్తవానికి పారికర్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో తన వ్యక్తిగత పర్యటన కోసం గోవా వెళ్లిన రాహుల్.. పారీకర్‌ను గోవా విధాన సభలో కలుసుకుని ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. 
 
ఈ సందర్భంగా వారిద్దరి రాఫెల్ డీల్ చర్చ జరిగినట్టు సమాచారం. ఈ విషయంపై మీడియా రాహుల్‌ను ప్రశ్నించగా, ఇది పూర్తిగా వ్యక్తిగతమని చెప్పారు. కానీ, బుధవారం మాత్రం రాహుల్ మరోలా వ్యాఖ్యానించారు. మిత్రుడు అనిల్ అంబానీకి మేలు చేసేందుకు ప్రధాని మోడీ ఆధ్వర్యంలో కుదుర్చుకున్న ఒప్పందంపై మాట్లాడేదేముందని పారికర్ అన్నారని రాహుల్ వెల్లడించారు.