1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 26 మార్చి 2021 (08:04 IST)

ఇద్దరూ ఒకే గదిలో వున్నారు.. ఏమైందో ఏమో కానీ.. అతడు అలా కనిపించాడు..?

ప్రేమ, పెళ్ళి, సహజీవనం ప్రస్తుతం ఈజీ అయిపోయింది. ఇంటికి తెలియకుండా చాలామంది సహజీవనం పేరిట కలిసివుంటున్నారు. ఇలా ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేసే ఇద్దరు ఉద్యోగులు ఒకే ఇంట్లో అద్దెకు వున్నారు. ఆమెతో పెరిగిన పరిచయం చనువుగా మారి ఇద్దరూ కలిసి అదే అద్దె ఇంట్లో ఉండేంతలా పరిస్థితి మారింది. కొన్నాళ్లు ఇద్దరూ అదే ఇంట్లో ఉంటూ, తింటూ బాగానే ఉన్నారు. కానీ.. ఏమైందో తెలియదు ఆ యువకుడు నాలుగు రోజుల క్రితం అదే ఇంట్లో శవమై కనిపించాడు. 
 
పూర్తి వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని బళ్లారి తాలూకా తోరణగల్లులోని బాబానగర్‌లో పశ్చిమ బెంగాల్‌కు చెందిన అశిశ్(28) నివాసముంటున్నాడు. స్థానిక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న క్రమంలో ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. ఆ మహిళతో కలిసే గత కొన్నేళ్లుగా యువకుడు అద్దె ఇంట్లో నివాసముంటున్నాడు. ఏమైందో తెలియదు గానీ.. అశిశ్ నాలుగు రోజుల క్రితం శవమై కనిపించాడు. అప్పటి నుంచి ఆ మహిళ కూడా అదృశ్యమైంది. అశిశ్ చనిపోయిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
 
అశిశ్ అద్దెకు ఉంటున్న గదిలో నుంచి దుర్వాసన రావడంతో ఇంటి యజమాని పోలీసులకు సమాచారమందించాడు. పోలీసులు గది తలుపులు తీసి చూడగా.. అశిశ్ శవం కనిపించింది. హత్య జరిగిన తీరును గమనించిన పోలీసులు.. నాలుగు రోజుల క్రితమే అశిశ్ హత్యకు గురైనట్లు చెప్పారు. ఈ హత్య ఘటనను పరిశీలిస్తే.. యువకుడిని ఆ మహిళతో పాటు మరికొందరు కలిసి హతమార్చి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.
 
ఇంటి యజమాని ఫిర్యాదు ఆధారంగా తోరణగల్లు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆ మహిళ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అశిశ్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.