1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 25 మార్చి 2021 (13:33 IST)

భార్య చేతిని నరికిన కసాయి.. పెళ్లైన రెండు నెలలకే ఘాతుకం..!

ప్రేమించి వివాహం చేసుకున్నాడు. అయితే భార్యను అనుమానంతో వేధింపులకు గురిచేశాడు. అంతటితో ఆగకుండా కసాయిలా చేతిని నరికాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని సాగర్‌ జిల్లాలో వెలుగుచూసింది. అనుమానం పెనుభూతమై పెళ్లైన రెండు నెలలకే భార్య చేతులు నరకడంతో బాధితురాలిని భోపాల్‌లోని హమిదియ దవాఖానకు తరలించారు. అక్కడి వైద్యులు తొమ్మిది గంటల పాటు ఆపరేషన్‌ నిర్వహించి ఆమె చేతులను తిరిగి మామూలు స్థితికి తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు.
 
భార్యపై అనుమానం పెంచుకున్న భర్త రణ్‌ధీర్‌ సోమవారం కట్టెలు తీసుకురావాలనే సాకుతో ఆమెను అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లాడు. మార్గమధ్యంలో రణ్‌ధీర్‌ గొడ్డలితో తన భార్య చేతులను నరికి అక్కడి నుంచి పారిపోయాడు. బాధితురాలిని నిందితుడు కేవలం రెండు నెలల కిందటే ప్రేమ వివాహం చేసుకున్నాడు. 
 
పెళైన పదిహేను రోజులకే భర్త తనను అనుమానంతో వేధించేవాడని, ఎవరితో మాట్లాడినా అభ్యంతరం తెలిపేవాడని బాధితురాలు పేర్కొన్నారు. మరోవైపు తమ ఇష్టానికి వ్యతిరేకంగా ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో మహిళ కుటుంబ సభ్యులు ఈ ఘటనపై స్పందించలేదు. ప్రస్తుతం బాధితురాలికి ఆమె మామ సంరక్షకులుగా ఉన్నారు. కోడలిపై ఘాతుకానికి పాల్పడ్డ కుమారుడిని ఇక చేరదీయనని ఆయన పేర్కొన్నారు.