శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 10 మే 2019 (11:58 IST)

వేసవి సెలవులు.. భార్య పుట్టింటికి వెళ్లింది.. పనిమనిషితో గడిపిన భర్త.. చివరికి?

వేసవి సెలవులు కావడంతో భార్య పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇక ఆ భర్త పనిమనిషిపై కన్నేశాడు. అదను చూసుకుని పనిమనిషితో శారీరక సుఖం అనుభవించాడు. కానీ చివరికి పనిమనిషితో గడిపిన పాపానికి పరువుతో పాటు డబ్బును కోల్పోయి పోలీసులను ఆశ్రయించాడు ఓ యువకుడు. ఈ ఘటన చెన్నై నగరంలోని ఈసీఆర్‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. చెన్నై, తిరువాన్మయూర్‌లో నివసిస్తున్న మనోజ్.. తన భార్యాపిల్లలు సమ్మర్ కంటూ పుట్టింటికి వెళ్లడంతో.. పనిమనిషి చిత్రతో ఖుషీఖుషీగా వున్నాడు. మనోజ్ తన సొంతిటిట్లోనే చిత్రతో శారీరకంగా కలిసేవాడు. ఓసారి చిత్ర బంధువు మనోజ్ ఇంటికి రావడం.. ఆ సమయంలో ఇరువురు సన్నిహితంగా వుండటం చూసి.. మనోజ్‌ను బెదిరించడం మొదలెట్టాడు. 
 
ఇలా రెండు లక్షలకు పైగా నగదును గుంజేశాడు. దాంతో ఆగకుండా మరో లక్ష రూపాయలు కావాలని లేకుంటే భార్యతో ఈ విషయాన్ని చెప్తానని, వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని బెదిరించాడు. ఇక చేసేది లేక మనోజ్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో వున్న పనిమనిషి చిత్ర, ఆమె బంధువును గాలిస్తున్నారు.