శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 11 డిశెంబరు 2020 (19:33 IST)

కార్తీక శని ప్రదోషం.. ఉప్పు, కారం, పులుపు తీసుకోకుండా.. పంచాక్షరీ మంత్రంతో..?

శని ప్రదోషం రోజున నందీశ్వరునికి గరిక సమర్పించడం ఉత్తమం. బిల్వ పత్రాలతో కూడిన మాలను సమర్పించవచ్చు. అలాగే నేతి దీపం వెలిగించి.. బియ్యం, బెల్లం నైవేద్యంగా సమర్పించడం ద్వారా మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. 
 
శని ప్రదోషం రోజున శివాలయాన్ని నిష్ఠతో ప్రదక్షణలు చేయాలి. ఆ రోజున శివాలయాన్ని చేసే ప్రదక్షణను సోమసూక్త ప్రదక్షణం అని పిలుస్తారు. శని ప్రదోష కాలంలో శివునిని దర్శించుకోవడం ద్వారా సకల సౌభాగ్యాలు చేకూరుతాయి. పాపాలు హరించుకుపోతాయి. పుణ్య ఫలితాలు చేకూరుతాయి. ఆ రోజున చేసే దానాలు అమితమైన ఫలితాలను ఇస్తాయి. మరో జన్మంటూ లేని ముక్తిని ప్రసాదిస్తుంది. 
 
శని ప్రదోష సమయంలో సమస్త దేవతలు.. నటరాజ స్వామిగా శివ స్వరూపుడు చేసే నృత్యాన్ని వీక్షించేందుకు శివాలయాలను విచ్చేస్తారని విశ్వాసం. ఈ కాలంలో శివునిని ఆరాధిస్తే.. సమస్త దేవతలను ఆరాధించినట్లే. నటరాజ స్వామి నందీశ్వరుని కొమ్ములకు మధ్యలో ఆడే సమయాన్నే ప్రదోష కాలం, ప్రదోష సమయం అంటారు. అందుకే నందీశ్వరుని కొమ్ముల నుంచి శివుడిని దర్శించడం శుభ ఫలితాలను ఇస్తుంది. 
Lord shiva
 
ప్రదోష కాలంలో పంచాక్షరీ మంత్రాన్ని జపించడం ఉత్తమ ఫలితాలను ప్రసాదిస్తుంది. ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా పితృదేవలు, ఏడు తరాల వారు చేసిన పాపాలు హరించుకుపోతాయి. అలాగే శని ప్రదోషం రోజున ఉపవసించి.. ఉప్పు, కారం, పులుపు తీసుకోకుండా వుండాలి. సాయంత్రం ప్రదోష కాల పూజను ముగించి.. ఉపవాసాన్ని పూర్తి చేయాలి.