సంబంధిత వార్తలు
- ఆహా ఏమి వైభవం, రెండుసార్లు గరుడసేవ
- చిన్నచిత్రమైనా, పెద్ద చిత్రమైనా మీ ఆశీర్వాదం అవసరం: దర్శకుడు మారుతి
- మాస్కులు తీసేసి ప్రశాంతంగా రోడ్లపై నడిచే పరిస్థితి రావాలని కోరుకున్నా: డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి
- ఇకపై కాలుష్య రహిత తిరుమల : స్పెసిఫైడ్ అథారిటీ నిర్ణయం
- శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను విడుదల చేసిన తితిదే
శ్రీ వేంకటేశ సుప్రభాతం విశిష్టత ఏమిటి?
భూలోకవైకుంఠమైన తిరుమల పుణ్యక్షేత్రంలో వెలిసిన జగత్ ప్రసిద్ధమైన ఆరాధ్య దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి. ఈ స్వామి వారికి సుప్రభాతం తెలుపుతూ ఆయన గుణగణ చేష్టితాలను కీర్తించే 70 శ్లోకాలున్న లఘుకృతి శ్రీ వేంకటేశ సుప్రభాతం.
దీనిని మనవాళ మహాముని రచించారు. ఒక్క ధనుర్మాసంలో తప్ప మిగిలిన అన్ని నెలల్లోనూ ఉషఃకాలంలో జరిగేది ఇదే. దీని పఠనా కాలం సుమారు 20 నిమిషాలు.
ఇందులో ప్రధాన వస్తువు శ్రీవారి దివ్యవైభవాన్ని ప్రశంసించడమే. ఇందులో సుప్రభాతం, స్తోత్రం, ప్రపత్తి, మంగళశాసనం వున్నాయి. ఇది వైష్ణవ సంప్రదాయ సంబంధమైనది.
