Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ గుడిలో పరమేశ్వరుడికి చేపల కూర నైవేద్యం

సాధారణంగా ఏ గుడిలోనైనా దేవుడికి పండ్లు, స్వీట్లు, పాయసం లాంటివి నైవేద్యంగా సమర్పిస్తారు. ఆలయాన్ని బట్టి కొన్నిచోట్ల పరమాన్నం, చక్కెర పొంగలి, దద్దోజనం లాంటివి నైవేద్యంగా పెట్టి తమ భక్తిని చాటుకుంటారు. ఒకరకంగా చెప్పాలంటే ఆయా ప్రాంతాల్లోని ఆచారాలు, సంప్

Written By chj
Updated: గురువారం, 9 ఆగస్టు 2018 (22:57 IST)
సాధారణంగా ఏ గుడిలోనైనా దేవుడికి పండ్లు, స్వీట్లు, పాయసం లాంటివి నైవేద్యంగా సమర్పిస్తారు. ఆలయాన్ని బట్టి కొన్నిచోట్ల పరమాన్నం, చక్కెర పొంగలి, దద్దోజనం లాంటివి నైవేద్యంగా పెట్టి తమ భక్తిని చాటుకుంటారు. ఒకరకంగా చెప్పాలంటే ఆయా ప్రాంతాల్లోని ఆచారాలు, సంప్రదాయాలకు అనుగుణంగానే అక్కడి దేవుడికి నైవేద్యాలను నివేదిస్తారు. కొన్ని ఆలయాల బయట జంతుబలి జరుగుతుండటం అందరికి తెలుసు. కొన్నిచోట్ల  దేవుళ్లకి మాంసాహారం కూడా నైవేద్యంగా సమర్పిస్తారట. 
 
అలాంటి దేవాలయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లా కొమరాడలోని గుంప సోమేశ్వర ఆలయంలోని పరమశివుడికి చేపల కూర నైవేద్యంగా సమర్పిస్తారు. శివుడికి చేపలేంటి.. ఇలాంటి వింత ఆచారాలేంటి అనుకుంటున్నారా... భక్త కన్నప్ప శివుడికి అడవిలో దొరికిన జంతు మాంసాన్ని పెట్టినట్లు పురాణాల్లో ఉంది. అలాగే ఇక్కడ ఇదో ప్రత్యేకమైన ఆచారం.
 
ఈ ఆలయంలో ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్లో శివుడికి చేపలకూరనే నైవేద్యంగా సమర్పిస్తారు. రుచిగా వండిన చేపలకూర శివుడికి నైవేద్యంగా మనసులోని కోరికలన్నీ నెరవేరుతాయని ఇక్కడి ప్రజల నమ్మకం. శతాబ్దాలుగా పూర్వీకులు పాటించిన సాంప్రదాయాలను తాము కూడా అనుసరిస్తున్నామని తద్వారా బోళాశంకరుణ్ణి ప్రసన్నం చేసుకుంటున్నామని భక్తులు పేర్కొంటున్నారు.

అన్నీ చూడండి

విమానం గాల్లో ఎగురుతూ వుండగా భారతీయుడికి ఆస్తమా, కన్నుమూత

సీబీఎస్ఈ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న ఎస్వీఐఎస్ అండర్-14 బాలుర జట్టు

వందేభారత్ రైలు ఢీకొని యువకుడు మృతి.. రీల్స్ చూస్తూ.. బైకుకు తోసుకొచ్చాడా?

రోడ్డు ప్రమాదంలో వరంగల్ సర్పంచ్ మృతి... భర్త రవీందర్ పరిస్థితి విషమం

జార్ఖండ్: రూ. 2.20 కోట్ల రివార్డు.. సీపీఐ మావో నేత ఆకాష్ లొంగుబాటు

అన్నీ చూడండి

Meenakshi Temple: చారిత్రాత్మక ఘట్టం.. మధురై మీనాక్షి అమ్మవారి మహా కుంభాభిషేకం (video)

17-09-2020 గురువారం నాటి రాశి ఫలాలు - ఆర్థికంగా అనుకూలమైన రోజు

గురువారం ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని 108 సార్లు పఠిస్తే?

బుధవారం.. వినాయకుడిని, బుధ గ్రహాన్ని పూజిస్తే.. ఆకుపచ్చ రంగులో...?

16-09-2020 రాశి ఫలాలు - వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి

తర్వాతి కథనం
Show comments