1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
  4. raghavendra swamy mahima's

రాఘవేంద్రస్వామి మహిమాన్వితం...

వెంకటనాథుడు క్రీ.శ.1621 దుర్మతి నామ సంవత్సరంలో ఫాల్గుణ శుద్ధ విదియనాడు రాఘవేంద్రస్వామి వారు సన్యాసాశ్రమం స్వీకరించారు. ఆ తరువాత ఆయన తన శిష్య బృందంతో కలిసి అనేక ప్రాంతాలను వెళుతారు. తన భక్తుని కుమారుడు

raghavendra
వెంకటనాథుడు క్రీ.శ.1621 దుర్మతి నామ సంవత్సరంలో ఫాల్గుణ శుద్ధ విదియనాడు రాఘవేంద్రస్వామి వారు సన్యాసాశ్రమం స్వీకరించారు. ఆ తరువాత ఆయన తన శిష్య బృందంతో కలిసి అనేక ప్రాంతాలను వెళుతారు. తన భక్తుని కుమారుడు మామిడి రసం నింపిన గంగాళంలో పడి మరణించినప్పుడు స్వామి మూల రామునిని స్మరించి తన భక్తుని కుమారుని బ్రతికిస్తారు.
  
 
ఎవరి సహాయసహకారాలు అందని ప్రదేశంలో తన భక్తుని భార్య ప్రసవ వేదనతో భాదపడుతుంటే ఆమెకి సుఖప్రసవం కలిగేలా చేస్తారు రాఘవేంద్రస్వామి వారు. పశువుల కాపరి అయిన వెంకన్నను ఆయన ఆశీర్వదించి తన అనుగ్రహ హస్తంతో దివాను అయ్యేలా చేస్తారు. ఓ వ్యక్తి అహంభావాన్ని నశింపజేయడం కోసం ఆ గ్రామంలో యజ్ఞయాగాదులు జరిగేలా చూడడం కోసం రోకలి చిగురించేలా చేస్తారు స్వామివారు. 
 
తన శక్తిని పరీక్షించాలనుకున్న నవాబుకు తగిన విధంగా సమాధామిచ్చి మంచాల గ్రామాన్ని బహుమతిగా పొందుతారు. ఈ ప్రాంతంలోని ప్రజలంతా కరవు కాటకాలతో బాధలు పడుతుంటారు. దాంతో రాఘవేంద్రస్వామి ఆ ప్రాంతంలోనికి వచ్చిన వెంటనే వర్ష ధారలు కురిపించి ఆ ప్రజలను కరవు కాటకాల నుండి కాపాడుతారు.      
About Writer
Kowsalya
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
18-09-2018 - మంగళవారం దినఫలాలు - అనాలోచితంగా చేసిన వ్యాఖ్యానాలు...