1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 29 మే 2023 (20:11 IST)

మహేష్ నవమి.. శివ పంచాక్షర పారాయణం చేస్తే..?

Lord shiva
మహేష నవమి 2023 మే 29న జరుపుకుంటారు. మహేశ నవమి నాడు శివపార్వతులను ఆరాధించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. శివుని దయతో మహేశ్వరి నవమి రోజున ఉద్భవించింది. మహేష నవమి నాడు ఉపవాసం ఉండటం వలన కోరిన కోరికలు నెరవేరుతాయి. మహేష్ నవమి పూజా విధానం, విశిష్టత గురించి తెలుసుకుందాం.
 
మహేష నవమి నాడు ఉదయాన్నే సూర్యోదయానికి నిద్రలేచి.. బ్రహ్మ ముహూర్తంలో ఈ రోజున గంగా నదిలో లేదా గంగాజలంలో స్నానం చేసి శివుడిని స్మరించుకోవాలి. స్నానం చేసిన తర్వాత శుభ్రమైన దుస్తులు ధరించి సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి. 
 
మహేష నవమి నాడు శివుడు, తల్లి పార్వతిని పూజించడానికి పండ్లు, పువ్వులు, ధూపం, దీపం, పాలు, పెరుగు మొదలైన వాటిని తీసుకోండి. ఈ సమయంలో శివుని మంత్రాలను జపించాలి. శివ పంచాక్షర పారాయణం కూడా శుభప్రదం.
 
శివలింగానికి అభిషేకం చేయడం వల్ల జీవితంలో ఆనందం- శ్రేయస్సు లభిస్తుంది. ఉపవాసం ఉన్నవారు సాయంత్రం హారతి తర్వాత ఆహారం తీసుకోవాలి. ఈ రోజున శివుడిని పూజించడం వల్ల సంతానం కలగాలనే భక్తుల కోరిక నెరవేరుతుంది. మహేష నవమి నాడు చేసే పూజ పిల్లల్లో సంతోషాన్ని, దాంపత్య జీవితంలో ఆనందాన్ని కలిగిస్తుంది.