సంబంధిత వార్తలు
- తితిదే శుభవార్త... తిరుమల యాత్రను వాయిదా వేసుకోండి..
- కుంభ్, కరోనా: దేవుడిపైనే భారమని భక్తులు అంటున్నారు, మరి, హరిద్వార్లో స్థానికులు ఏమంటున్నారు?
- తిరుపతిలో ప్రతిరోజు 500 కేసులు, మహారాష్ట్ర భక్తులే కారణమా?
- హనుమంతుని జన్మస్థానంగా తిరుమల క్షేత్రం.. ఉగాది రోజున..?
- మనిషి మనిషే.. దేవుడు దేవుడే... మనిషి దేవుడు కాలేడు : చంద్రబాబు
భక్తులు లేక బోసిబోయిన తిరుమల గిరులు...
మొన్నటివరకు రోజుకు దాదాపు లక్ష మందికి పైగా భక్తులతో కిటకిటలాడిన తిరుమల గిరులు, ఇప్పుడు భక్తులు లేక వెలవెలబోతున్నాయి. కరోనా, లాక్డౌన్ కారణంగా కొన్నాళ్లు మూతపడిన ఆలయం, తిరిగి తెరచుకుని రోజుకు 50 వేల మందికి స్వామి దర్శనం కల్పించారు.
అయితే, ఇటీవలికాలంలో పెరుగుతున్న కేసులు, మరోమారు ప్రభావాన్ని చూపుతున్నాయి. దీంతో భక్తుల రద్దీ గణనీయంగా తగ్గింది. గురువారం నాడు స్వామివారిని కేవలం 16,412 మంది దర్శించుకోగా, హుండీ ద్వారా రూ.1.98 కోట్ల ఆదాయం వచ్చిందని, 7,974 మంది తలనీలాలు సమర్పించారని టీటీడీ అధికారులు తెలిపారు.
తర్వాతి కథనం
