1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: శనివారం, 10 ఏప్రియల్ 2021 (18:14 IST)

తిరుపతిలో ప్రతిరోజు 500 కేసులు, మహారాష్ట్ర భక్తులే కారణమా?

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతిని కరోనా వణికిస్తోంది. గత మూడు రోజుల నుంచి కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. గత వారం రోజుల ముందు వరకు కేవలం 40 నుంచి 50 వరకు మాత్రమే ఉన్న కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. పెరుగుతున్న కరోనా కేసులతో తిరుపతి ప్రజలు వణికిపోతున్నారు. 
 
గత మూడు రోజుల నుంచి ప్రతిరోజు 500కి చేరువగా కరోనా కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో ఈరోజు 740 పాజిటివ్ కేసులు, నిన్న 496 కేసులు, మొన్న 465 కేసులు. ఇలా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. ఒక్క తిరుపతిలోనే కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది.
 
అలాగే చిత్తూరు, శ్రీకాళహస్తి, పలమనేరులలో కోవిడ్ కేసులు ఎక్కువగా ఉన్నాయి. తిరుపతిలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో స్థానికులకే కాదు భక్తుల్లోను ఆందోళన కనిపిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్ర నుంచి వస్తున్న భక్తులను దృష్టిలో ఉంచుకుని సోమవారం నుంచి ఆఫ్‌లైన్లో టోకెన్లను నిలిపివేయాలని టిటిడి నిర్ణయం తీసుకుంది.
 
మహారాష్ట్రంలో కేసులు పెరుగుతున్న దృష్ట్యా టిటిడి ఈ నిర్ణయం తీసుకుంది. వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు వస్తున్న దృష్ట్యా టిటిడి కూడా అప్రమత్తమవుతోంది. శానిటైజర్లను భక్తులకు అందిస్తోంది. మాస్క్‌లను తప్పనసరి చేసింది. కాగా తిరుపతిలో ఎక్కువగా కరోనా కేసులు నమోదు అవడం వెనుక మహారాష్ట్ర నుంచి వస్తున్న భక్తులే కారణమన్న వాదన వినిపిస్తోంది.