1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
  4. Lord Venkateswara rides Swarna Ratham

స్వర్ణరథంపై తిరువీధుల్లో ఊరేగిన మలయప్ప స్వామి

golden ratham
తిరుమలలో జరుగుతున్న ఆరవ రోజు వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మలయప్ప స్వామి తిరుమాడ వీధుల్లో విహరించారు. బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల మధ్య శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప ఉత్సవమూర్తులు స్వర్ణరథంపై తిరువీధుల్లో అంగరంగ వైభవంగా ఊరేగారు. పట్టువస్త్రాలు, విలువైన ఆభరణాలతో అలంకరించబడిన మలయప్ప స్వామిని తిలకించిన భక్తులు 'గోవిందా... గోవిందా...' అంటూ స్మరించుకున్నారు. 
 
మరోవైపు హ‌నుమంత వాహ‌నంపై కోదండ రామునిగా శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామి శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు బుధ‌వారం ఉదయం 8 గంటలకు శేషాచలాధీశుడు శ్రీ కోదండ రాముని అవతారంలో ధ‌నుస్సు, బాణం ధ‌రించి తన భక్తుడైన హనుమంతునిపై ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
బతుకమ్మ పండుగ చివరి రోజు.. సద్దుల బతుకమ్మను రకరకాల పువ్వులతో..