సంబంధిత వార్తలు
- తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. అంకురార్పణంతో ప్రారంభం
- తిరుమల: డిక్లరేషన్పై సంతకం చేసిన పవన్ చిన్న కుమార్తె అంజనీ (video)
- దేవుడి కోర్టులో శిక్షకు జగన్ సిద్ధం కావాలి.. నారా లోకేష్
- నేటి నుంచి శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు రిజిస్ట్రేషన్ ప్రారంభం...
- తిరుమలలో వార్షిక బ్రహ్మోత్సవం..విస్తృత ఏర్పాట్లు
స్వర్ణరథంపై తిరువీధుల్లో ఊరేగిన మలయప్ప స్వామి
తిరుమలలో జరుగుతున్న ఆరవ రోజు వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మలయప్ప స్వామి తిరుమాడ వీధుల్లో విహరించారు. బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల మధ్య శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప ఉత్సవమూర్తులు స్వర్ణరథంపై తిరువీధుల్లో అంగరంగ వైభవంగా ఊరేగారు. పట్టువస్త్రాలు, విలువైన ఆభరణాలతో అలంకరించబడిన మలయప్ప స్వామిని తిలకించిన భక్తులు 'గోవిందా... గోవిందా...' అంటూ స్మరించుకున్నారు.
మరోవైపు హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు బుధవారం ఉదయం 8 గంటలకు శేషాచలాధీశుడు శ్రీ కోదండ రాముని అవతారంలో ధనుస్సు, బాణం ధరించి తన భక్తుడైన హనుమంతునిపై ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు.
