NRI: గుడ్ న్యూస్- శ్రీవారి వీఐపీ దర్శనం.. ఎన్నారై కోటాను రోజుకు వందకి పెంచారోచ్!
శ్రీవారిని దర్శించుకోవాలనుకునే ఎన్నారైలకు గుడ్ న్యూస్. తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాల కోసం ఎన్నారై కోటాను రోజుకు 100కి పెంచారు. గత వైకాపా నేతృత్వంలోని ప్రభుత్వ హయాంలో, కోటాను రోజుకు 50 నుండి కేవలం 10కి తగ్గించారు. దర్శనం పొందడానికి, ప్రవాస భారతీయులు (ఎన్నారైలు) అధికారిక ఏపీఎన్నార్టీఎస్ వెబ్సైట్లో నమోదు చేసుకోవాలి. దరఖాస్తుదారులు నివాస దేశం, చెల్లుబాటు అయ్యే వీసా సమాచారం, పని అనుమతితో సహా వివరాలను అందించాలి. రాబోయే మూడు నెలలకు స్లాట్లు వెబ్సైట్లో ప్రదర్శించబడతాయి.
లభ్యత ఆధారంగా టిక్కెట్లను టీటీడీ కేటాయిస్తుంది. టికెట్లు కేటాయింపులు అయిన వారికి ఏపీఎన్ఆర్టీఎస్కు చెందిన పీఆర్ఓ ద్వారా వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తారు. వివరాలకు ప్రవాసాంధ్రుల వైబ్సైట్ ద్వారాగానీ, ఏపీలోని తాడేపల్లి, ఏపీఎన్ఆర్టీ సొసైటీ జంక్షన్ ఫోన్ నంబర్ 0863 2340678లో గానీ సంప్రదించవచ్చని సంస్థ ప్రతినిధి వెంకట్రెడ్డి వెల్లడించారు.