శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 11 డిశెంబరు 2020 (09:16 IST)

వైకుంఠ ఏకాదశి పర్వదినం : 2 లక్షల టిక్కెట్లు రిలీజ్ చేసిన తితిదే

ఈ నెలాఖరులో వైకుంఠ ఏకాదశి పర్వదినం రానుంది. దీన్ని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం 2 లక్షల మంది భక్తులకు దర్శనం కల్పించనుంది. ఇందుకోసం 2 లక్షల ఆన్‌లైన్ టిక్కెట్లను రిలీజ్ చేసింది. 
 
వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా 2 లక్షల మంది భక్తులకు ఆన్‌లైన్ టికెట్లను విక్రయించడం ద్వారా, పది రోజుల వ్యవధిలో వారందరికీ శ్రీ వెంకటేశ్వరుని దర్శనం కల్పించాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. 
 
ఇందుకోసం ఆన్‌లైన్‌లో రోజుకు 20 వేల టికెట్లను విడుదల చేసింది. రోజుకు 20 వేల టికెట్లను భక్తులకు విక్రయిస్తామని, ఆగమ శాస్త్ర నిపుణుల సలహాలు తీసుకున్న మీదటే 10 రోజుల పాటు వైకుంఠ ద్వారాలను తెరచివుంచాలన్న నిర్ణయం తీసుకున్నామని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు. 
 
నేటి నుంచి ఆన్‌లైన్‌లో ఈ టికెట్లను బుక్ చేసుకోవచ్చని స్పష్టం చేశారు. కాగా, ఈ సంవత్సరం వైకుంఠ ఏకాదశి డిసెంబర్ 25వ తేదీన రానుంది.