తిరుమల వెంకన్న కంప్యూటర్లకు వాన్నక్రై వైరస్‌ దెబ్బ

తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన కంప్యూటర్లకు వాన్నక్రై వైరస్ సోకింది. రెండ్రోజుల క్రితం ప్రపంచ వ్యాప్తంగా వివిధ సంస్థల కంప్యూటర్‌ వ్యవస్థను స్తంభింపజేసిన ఈ వైరస్... ఇపుడు తితిదేను తాకింది. సుమారు

బుధవారం, 17 మే 2017 (12:34 IST)
తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన కంప్యూటర్లకు వాన్నక్రై వైరస్ సోకింది. రెండ్రోజుల క్రితం ప్రపంచ వ్యాప్తంగా వివిధ సంస్థల కంప్యూటర్‌ వ్యవస్థను స్తంభింపజేసిన ఈ వైరస్... ఇపుడు తితిదేను తాకింది. సుమారు 20 కంప్యూటర్లు ఈ వైరస్‌ బారిన పడినట్లు తెలుస్తోంది. అయితే, భక్తులకు సమాచారం అందించే వ్యవస్థపై మాత్రం ఎలాంటి ప్రభావం చూపించలేదు.
 
కంప్యూటర్లలోని కేవలం పరిపాలనా పరమైన కొన్ని అంశాలకు వైరస్‌ సోకడాన్ని సిబ్బంది గుర్తించారు. వాస్తవానికి అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన సాఫ్ట్‌వేర్‌ను తితిదే వినియోగిస్తున్నప్పటికీ.. కిందిస్థాయి సిబ్బంది ఉన్నతాధికారులకు తెలియకుండా పైరేటెడ్‌ సాఫ్ట్‌వేర్‌ను కంప్యూటర్లలో నిక్షిప్తం చేయడంతో ఈ పరిస్థితి తలెత్తినట్లు అధికారులు గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన తితిదే ఐటీ విబాగం అధికారులు వైరస్‌ సోకిన కంప్యూటర్లను తొలగించారు. ఇతర వ్యవస్థకు ఇబ్బందుల్లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
 

అన్నీ చూడండి

అమిత్ షా గారూ, ఆయన్ని అరెస్ట్ చేయరా: డిప్యూటీ సీఎం పవన్ డైలాగ్‌తో పగలబడి నవ్విన జనసైనికులు, వీడియో

Vijay : ఢిల్లీలో ప్రధానిని కలిసిన తమిళనాడు సీఎం విజయ్

రాగి శాసనాలను స్వదేశానికి తెప్పించిన ప్రధాని మోడీ.. ప్రశంసించిన సీఎం విజయ్

మమతా బెనర్జీకి షాకిచ్చిన బరాసత్ ఎంపీ... అన్ని పదవులకు రిజైన్

దేశంలో సుధీర్ఘ దూరం ప్రయాణించే రైలు ఏది?

అన్నీ చూడండి

మూడేళ్లకు ఒకసారి వచ్చే పద్మిని ఏకాదశి.. తులసి దళాలతో అర్చన చేస్తే?

27-05-2026 బుధవారం ఫలితాలు- దంపతుల మధ్య అకారణ కలహం

Eid Al-Adha 2026 date: తెలుగు రాష్ట్రాల్లో మే 28, 2026 గురువారం బక్రీద్.. సెలవు దినం

26-05-2026 మంగళవారం ఫలితాలు - ధనసహాయం తగదు

25-05-2026 సోమవారం ఫలితాలు - ఖర్చులు అదుపులో ఉండవు.. ముఖ్యుల కలయిక వీలుపడదు...

తర్వాతి కథనం
Show comments