వినాయక చతుర్థి స్పెషల్- పాలతాలికలు ఎలా చేయాలంటే?

ఆదివారం, 1 సెప్టెంబరు 2019 (18:20 IST)
వినాయక చతుర్థి రోజున ఉండ్రాళ్ళు, పాలతాలికలు, పండ్లు వంటివి గణేశునికి నైవేద్యంగా సమర్పిస్తారు. అలాంటి నైవేద్యాల్లో ఒకటైన పాలతాలికలను ఎలా చేయాలో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు
‌పాలు -  ఒకటిన్నర లీటరు. 
నీళ్లు - ఒక లీటరు. 
పంచదార - పావు కేజీ
‌బెల్లం - పావుకేజి. 
యాలకుల పొడి - ఒక టీ స్పూను. 
నెయ్యి - కొద్దిగా. 
‌సగ్గు బియ్యం - ‌వందగ్రాములు. 
బియ్యపిండి - వందగ్రాములు. 
మైదాపిండి - రెండు టీ స్పూన్లు 
 
తయారీ విధానం: 
ముందుగా పాలను నీటిని మరిగించాలి. అందులో సగ్గుబియ్యాని కూడా ఉడికించుకోవాలి. ఈలోపు బియ్యంపిండిలో మైదాపిండి, ఒక స్పూను పంచదారతో పిండిలా కలుపుకోవాలి. పిండిని తాలికల్లా చేసుకుని మరుగుతున్న పాలలో వేసి ఉడికించాలి. ఈ జంతికలు అతుక్కోకుండా కలుపుతూ వుండాలి. తాలికలు ఉడికేలోపుగా బెల్లం, పంచదార కలిపి పాకం పట్టి చల్లారనివ్వాలి. తాలికలు ఉడికిన తరువాత దించేసి చల్లారిన పాకాన్ని, యాలకుల పొడిని వేసి కలపాలి. అంతే పాల తాలికలు సిద్ధమైనట్లే. ఈ వంటకాన్ని వినాయకుడికి నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. 

అన్నీ చూడండి

తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార పథకం... బస్సు సేవలు కూడా..

Thunderstorm : ఏపీలో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు

ఆకాశంలో ఢీకొన్న రెండు హెలికాఫ్టర్లు : పాప్ సింగర్‌తో సహా ఆరుగురి దుర్మరణం

ఉద్యోగి తీవ్రమైన అక్రమాలకు పాల్పడితే ఉద్యోగం నుంచి తొలగించడం సబబే : సుప్రీంకోర్టు

'ఆకాశంలో ఒక తార' హీరోయిన్ స్నేహితురాలిపై అత్యాచారం

అన్నీ చూడండి

ప్రజలు రమ్మంటున్నారు... రాజకీయాల్లోకి వస్తున్నా : రాఘవ లారెన్స్

Nag Ashwin: మహానటి తర్వాత ప్రేక్షకులు ఓన్ చేసుకున్న సినిమా సింగ్ గీతం: నాగ్ అశ్విన్

సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్‌కు భయపడి క్షమాపణ చెప్పి ఉండాల్సిందికాదు : అనంత్ శ్రీరామ్

ప్రజలు కుక్కలు అని ఎలా అంటాను? టీవీకె గురించి నేనలా అన్నాననీ: రాఘవ లారెన్స్

కాశీలో రేణూ దేశాయ్.. ఎందుకో తెలుసా?

తర్వాతి కథనం
Show comments