గురువారం, 19 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 18 జులై 2024 (21:45 IST)

సికింద్రాబాద్‌ క్లాక్ టవర్ వద్ద దోచేశారు.. కిలో బంగారం కొట్టేశారు..

gold
సికింద్రాబాద్‌లో నగల వ్యాపారి నుంచి కిలో బంగారం దోచుకెళ్లారు. వివరాల్లోకి నగల వ్యాపారి తన సేల్స్‌మెన్‌తో కలిసి ఒక బ్యాగ్‌లో ఉంచిన కిలో బంగారంతో మోటార్‌ సైకిల్‌పై సికింద్రాబాద్‌లోని మోండా మార్కెట్‌లోని తమ దుకాణానికి వెళుతున్నారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్‌లో గురువారం సాయంత్రం నగల వ్యాపారి నుంచి దొంగలు కిలో బంగారం దోచుకెళ్లారు. 
 
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్రైం స్పాట్ పరిసరాల్లో అమర్చిన క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. నిందితులను గుర్తించి పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. షాపు యజమాని లేదా సేల్స్‌మెన్‌కు తెలిసిన వ్యక్తులే ఈ దోపిడీకి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.