బుధవారం, 6 ఆగస్టు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 5 ఆగస్టు 2025 (11:51 IST)

Bhadradri: హైటెన్షన్ విద్యుత్ తీగలు బైక్‌కు తగిలి ఓ వ్యక్తి సజీవ దహనం.. ఎక్కడ?

fire
fire
హైటెన్షన్ విద్యుత్ తీగలు బైక్‌కు తగలడంతో ఓ వ్యక్తి సజీవ దహనం అయ్యాడు. మంగళవారం నాడు ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం పరిధిలోని శంబునిగూడెం పంచాయతీలోని వెన్నలబైలు గ్రామంలో ఈ సంఘటన జరిగింది. 
 
సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రవీందర్ ప్రకారం, బాధితుడిని పార్సిక రాజు (35) తన వ్యవసాయ పొలానికి వెళుతుండగా, బైక్ ప్రమాదవశాత్తు లైవ్ హైటెన్షన్ వైర్లను తాకింది. 
 
హైటెన్షన్ వైర్లు బైక్‌కు తాకగానే మంటలు అంటుకున్నాయి. ఈ మంటల్లో చిక్కుకుని రాజు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ మంటలు బైక్‌ను దగ్ధం చేశాయి. రాజుకు భార్య, ఇద్దరు పిల్లలు వున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.