1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 3 జూన్ 2024 (10:31 IST)

మరో రెండు రోజుల్లో తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు

నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాకు చేరుకున్నాయని, మరో రెండు రోజుల్లో తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. నైరుతి బంగాళాఖాతం, కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడు తీరాల దగ్గర నైరుతి గాలుల ప్రభావంతో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని.. ఈరోజు, రేపు తెలంగాణలో వర్షాలు కురుస్తాయని ఆ శాఖ పేర్కొంది. 
 
అదనంగా, నైరుతి రుతుపవనాల రాకతో ముషీరాబాద్, చిక్కడపల్లి, కవాడిగూడ, దోమలగూడ, ఉప్పల్, రామాంతపూర్, బోడుపాల్, మేడిపల్లి, కుత్బుల్లాపూర్, సుచిత్ర, కొంపల్లి, చింతల్, సూరారం, బోయినగర్, బోయినపల్లి తదితర ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. 
 
పలు డ్రైనేజీలు పొంగిపొర్లడంతో లోతట్టు ప్రాంతాలకు వరదనీరు చేరింది. ప్రభావిత ప్రాంతాల్లో నివాసితులకు భద్రత కల్పించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.