సంబంధిత వార్తలు
- తెలంగాణాలో అధికారం మనదే... సమన్వయంతో పని చేయండి : నేతలకు వేణు హితవు
- తెలంగాణ : డోలీలో ఆస్పత్రికి వెళ్లిన గర్భిణీ మహిళ.. 20కిలో మీటర్లు..?
- ఆసియాలోనే అతిపెద్ద డిస్ట్రిక్ట్ కూలింగ్ ప్రాజెక్ట్ను ఏర్పాటు చేయటం కోసం తబ్రీద్తో తెలంగాణ భాగస్వామ్యం
- తెలంగాణలో భారీ వర్షాలు.. మరో ఐదు రోజులు ఇంతే..
- తెలంగాణలోని ప్రజారోగ్య కేంద్రాలకు విరాళం అందించిన నెక్స్ట్రాకర్
తెలంగాణలో పెరిగిపోతున్న డెంగ్యూ కేసులు
తెలంగాణ రాష్ట్రంలో డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి. ఆగస్టు నెలలో రోజుకు సగటున వంద మందికి పైగా దీని బారిన పడ్డట్లు వైద్యశాఖ వెల్లడించింది. వర్షాల కారణంగా దోమలు నీటిలో వాసం చేయడం ద్వారా డెంగీ కేసులు పెరిగిపోతున్నాయని వైద్యులు చెప్తున్నారు.
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో డెంగీ కేసుల సంఖ్య ఎక్కువగా నమోదవుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ఒకే వారంలో 120 డెంగీ కేసులు నమోదయ్యాయి.
రాష్ట్రవ్యాప్తంగా 182 కేసులు నమోదైనట్లు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ప్రజలకు వ్యక్తిగత పరిశుభ్రతపై సరైన అవగాహన లేకపోవడం, సరైన చికిత్సలు తీసుకోకపోవడం ఇందుకు కారణమని వైద్యులు చెప్తున్నారు.
