1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 16 అక్టోబరు 2022 (10:53 IST)

నగ్న వీడియోలతో చర్లపల్లి జైలు డిప్యూటీ ఎస్పీకి సైబర్ నేరగాళ్ల బురిడీ

నగ్న వీడియోలతో హైదరాబాద్ నగరంలోని చర్లపల్లి కేంద్ర కారాగారంలో పని చేసే డిప్యూటీ సూపరింటెండెంట్‌కు సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టించారు. తొలుత అమ్మాయిలతో నగ్నంగా మాట్లాంచిన కేటుగాళ్లు ఆ తర్వాత నగ్న వీడియోలపై యూట్యూబ్ నుంచి ఫిర్యాదు అందిందూ సీబీఐ అధికారి పేరుతో ఫోన్ చేసి బెదిరించారు. చివరు జైలు అధికారి బ్యాంకు ఖాతా నుంచి రూ.97500 మాయం చేశారు.

ఈ ఫోన్ కాన్ వెస్ట్ బెంగాల్ రాష్ట్రం నుంచి చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఈ వివరాలను పరిశీలిస్తే, చర్లపల్లి జైలులో డిప్యూటీ సూపరింటెండెంట్‌గా ఓ అధికారి పని చేస్తున్నారు. ఆయనక ఇటీవల కొందరు యువతులు ఫోనులో చాటింగ్ చేశారు. ఆ తర్వాత నగ్నంగా వీడియో కాల్‌ చేసి మాటలు కలిపారు. ఆయనతోనూ అలాగే మాట్లాడించారు. దానిని రికార్డు చేసిన నేరగాళ్లు ఆ తర్వాత అసలు రూపం బయటపెట్టారు.

ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెడతామని బెదిరించారు. వారి బెదిరింపులను ఆయన పట్టించుకోలేదు. ఆ తర్వాత కొన్ని రోజులకు సీబీఐ అధికారి అజయ్ కుమార్ పాండే పేరుతో జైలు అధికారికి ఫోన్ చేసి.. మీ అసభ్య వీడియోపై యూట్యూబ్ నుంచి ఫిర్యాదు అందిందని, తనకు డబ్బులు చెల్లిస్తే మేనేజ్ చేసుకుంటానని నమ్మించాడు.

అంతేకాదు, సీబీఐ పేరుతో నకిలీ లేఖ కూడా పంపాడు. రాహుల్ శర్మ అనే వ్యక్తి నంబరు ఇచ్చి ఆయనకు ఫోన్ చేసి సెటిల్ చేసుకోవాలని సూచించాడు. ఆయన ఇచ్చిన నంబరుకు జైలు అధికారి ఫోన్ చేశారు. యూట్యూబ్ నుంచి వీడియోలు తొలగించేందుకు రెండు విడతలుగా రూ.97,500 చెల్లించుకున్నారు.

ఆ తర్వాత కూడా మరోమారు ఫోన్ చేసి మరో రెండు వీడియోలు ఉన్నాయని, వాటిని వైరల్ చేయకుండా ఉండాలంటే రూ.85 వేలు చెల్లించాలని డిమాండ్ చేశాడు. దీంతో అయోమయంలో పడిన అధికారిని గమనించిన తోటి ఉద్యోగి ద్వారా విషయం ఆరా తీశారు.

అది విని ఇది సైబర్ మోసం తప్ప మరోటి కాదని ఆయనకు చెప్పారు. దీంతో ఆయన కుషాయిగూడ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఫోన్ కాల్స్ ఆధారంగా నిందితులు పశ్చిమ బెంగాల్‌కు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.