శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 3 సెప్టెంబరు 2022 (11:49 IST)

మాట్రిమోనీ ముసుగులో మస్కా కొట్టాడు.. చివరికి..?

marriage
విశాఖలో మాట్రిమోనీ ముసుగులో మస్కా కొట్టిన ఘటన వెలుగుచూసింది. రెండో వివాహం కోసం ప్రొఫైల్ పెట్టిన మహిళలే టార్గెట్‌గా.. వెబ్‌సైట్‌లో పెట్టిన వివరాల ఆధారంగా మోసాలకు పాల్పడుతున్నారు నైజీరియన్లు. విదేశాల్లో ఉన్నత స్థానంలో ఉన్నట్లు చెప్తూ పరిచయం చేసుకుంటున్న కేటుగాళ్లు. 
 
ఢిల్లీ ఎయిర్ పోర్ట్ నుంచి కస్టమ్స్ అధికారులు అంటూ ఇంకొకరితో ఫోన్ చేయించడం.. టాక్స్ కడితే విడిచి పెట్టేస్తానంటూ లక్షలు గుంజేస్తున్న వైనం బయటపడింది. విశాఖలో జరిగిన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. మధురవాడకు చెందిన ఒక ముస్లిం యువతికి కొన్నాళ్ల కిందట వివాహమైంది. 
 
రెండేళ్ల పాప వుంది. భర్తతో విభేదాలు రావడంతో విడిపోవాలని నిర్ణయించింది. రెండో పెళ్లి కోసం తన ప్రొఫైల్ ఒక మ్యాట్రీమోనీ డాట్‌కామ్‌లో అప్‌లోడ్ చేశారు. సంబంధిత వెబ్ సైట్ ఆమె వివరాలను చూసిన కేటుగాళ్లు.. నెలరోజుల కిందట ఆమెకు ఫోన్ చేశారు. 
 
దుబాయ్‌లో వుంటానని నమ్మబలికాడు. గిఫ్టులు కస్టమ్స్ అంటూ డబ్బులు పంపమని.. మోసం చేశాడు. సదరు మహిళ డబ్బు పంపాక ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు. అప్పుడే తాను మోసపోయానని గ్రహించిన మహిళ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది.