కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన లాక్డౌన్ను అమలు చేస్తున్నాయి. ప్రజలకు అత్యవసర సేవల్లో అంతరాయం కలగకుండా ప్రభుత్వ కార్యాలయాల్లో పరిమిత సంఖ్యలో అధికారులు, సిబ్బంది విధులకు హాజరయ్యేలా ఆదేశాలు జారీ చేసింది. ఓ వైపు పరిస్థితి ఇలావుంటే లంచాలకు అలవాటు పడిన కొందరు ప్రభుత్వ ఉద్యోగులు ఇవేవీ పట్టించుకోకుండా పని కావాలంటే పైసలు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. దీంతో అవినీతిపై...