కెమికల్ సేవించి చిన్నారి మృత్యువాత

ఆదివారం, 3 అక్టోబరు 2021 (10:51 IST)
తెలంగాణాలోని కామారెడ్డి జిల్లాలో ఓ విషాదకర ఘటన సంభవించింది. అభంశుభం తెలియని చిన్నారి ఒకరు రసాయనం తాగి మృత్యువాతపడింది. ఈ హృదయ విదారక సంఘటన కామారెడ్డి జిల్లా మద్నూర్‌ మండలం రాచూర్‌లో చోటుచేసుకుంది. 
 
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన జ్యోతిక - సూర్యకాంత్‌ దంపతుల పెద్ద కుమార్తె అదిత్య(5) శనివారం అంగన్‌వాడీ కేంద్రానికి వచ్చింది. ఆ సమయంలో గదిలో ఉన్న రసాయనం తాగి స్పృహ తప్పి పడిపోయింది. కొంతసేపటికి గమనించిన కేంద్రం నిర్వాహకురాలు నగరబాయి.. పాపను చిన్నారి ఇంటికి తీసుకువెళ్లింది. 
 
ఆ చిన్నారి పరిస్థితి విషమంగా ఉండటంతో కుటుంబ సభ్యులు మహారాష్ట్రలోని దెగ్లూర్‌ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి నిజామాబాద్‌కు తరలించారు. మార్గమధ్యంలో అదిత్య మృతి చెందింది. ఈ విషయంపై సీడీపీవో సునందను సంప్రదించగా చిన్నారి మృతి చెందినట్లు సమాచారం అందిందని, పూర్తి వివరాలు తెలుసుకుంటామని సమాధానమిచ్చారు.

అన్నీ చూడండి

Kiran Abbavaram,: యు/ఎ సర్టిఫికేషన్ పొందిన కిరణ్ అబ్బవరం... చెన్నై లవ్ స్టోరీ

Ravi Teja : ఇరుముడి' డబ్బింగ్ ప్రారంభించిన రవితేజ- త్వరలోనే సెకండ్ సింగిల్

శాన్‌ఫ్రాన్సిస్కోలో M4M 2 మూవీ సీక్వెల్‌ను అధికారికంగా ప్రకటించారు

Sitara: ఎప్పటికీ చిన్నారి తార.. సితార అంటూ మహేష్ బాబు ఆప్యాయంగా ముద్దుపెట్టారు.

Vijay Deverakonda: రౌడీ జనార్థన మూవీ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ

తర్వాతి కథనం
Show comments