1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Magnitude 4 Earthquake Strikes in Nagar Kurnool District

నాగర్‌కర్నూల్‌లో స్వల్ప భూకంపం

Nagar Kurnool
తెలంగాణ రాష్ట్రంలోని నాగర్‌కర్నూల్ జిల్లాలో సోమవారం ఉదయం స్వల్ప భూకంపం సంభవించింది. జిల్లాలోని అచ్చంపేట, లింగాల పరిసర గ్రామాలు, అమ్రాబాద్‌, ఉప్పునూత మండలాల్లో సోమవారం ఉదయం 5 గంటలకు రెండు సెకన్ల పాటు భూమి కంపించింది. 
 
దీని తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 4.0గా నమోదైందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ (ఎన్‌సీఎస్‌) వెల్లడించింది. హైదరాబాద్‌కు దక్షిణంగా 150 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని తెలిపింది. భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో ప్రకంపణలు వచ్చాయని పేర్కొన్నది. భూ ప్రకంపనలతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
నేటి నుంచి కొత్త రేషన్ కార్డుల జారీ