ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సిహెచ్
Last Modified: గురువారం, 22 జులై 2021 (22:54 IST)

జూలై25న పెట్‌ అడాప్షన్‌, ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించనున్న మార్స్‌ పెట్‌కేర్‌

యానిమల్‌ వెల్ఫేర్‌ ఆర్గనైజేషన్‌ వెట్స్‌ సొసైటీ ఫర్‌ యానిమల్స్‌ వెల్ఫేర్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ (వీఎస్‌ఏడబ్ల్యుఆర్‌డీ)తో కలిసి మార్స్‌ పెట్‌కేర్‌ సంస్ధ ఈ నెల 25వ తేదీన హైటెక్‌ సిటీ వద్ద నున్న వీ కన్వెన్షన్‌ సెంటర్‌లో పెట్‌ అడాప్షన్‌, ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించబోతుంది.

ఈ ఆరోగ్య శిబిరం ద్వారా వీధి జంతవుల పట్ల అవగాహన కల్పిస్తూనే కుక్క, పిల్లి పిల్లలను దత్తత తీసుకునేందుకు  నగరవాసులనూ ప్రోత్సహించనున్నారు. వరుసగా నిర్వహించబోయే ఈ ఆరోగ్య శిబిరాలలో మొదటి దానిని ఈ నెల 25వ తేదీ ఉదయం 11 గంటల నుంచి వీ సెంటర్‌లో నిర్వహించనున్నారు.

ఈ పెట్‌ హెల్త్‌ శిబిరంలో భాగంగా రెండు మొబైల్‌ డాగ్‌ క్లీనిక్స్‌ను సైతం అందుబాటులో ఉంచనున్నారు. పెంపుడు జంతువుల ఆరోగ్య పరీక్షలను చేయడంతో పాటుగా యాంటీ రేబిస్‌ వ్యాక్సిన్‌లను సైతం ఇక్కడ అందించనున్నారు.

ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్‌లోని  వెటర్నరీ సైన్స్‌ కాలేజీలో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ మెడిసన్‌ హెడ్‌ ఆఫ్‌ ద డిపార్ట్‌మెంట్‌ డాక్టర్‌ సతీష్‌ కుమార్‌ తో పాటుగా వీఎస్‌ఏడబ్ల్యుఆర్‌డీ ఫౌండర్‌ డాక్టర్‌ మురళీధర్‌ దాసరి తదితరులు పలు అంశాలపై ఉపన్యసించనున్నారు.