శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 9 ఏప్రియల్ 2022 (10:06 IST)

తెలంగాణలో భారీగా పెట్టుబడులు: రూ.1000 కోట్లతో కోకాకోలా కంపెనీ

ktr
ktr
తెలంగాణలో భారీగా పెట్టుబడులు వచ్చాయి. తెలంగాణలో తాజాగా హిందుస్థాన్‌ కోకాకోలా బేవరేజెస్‌ (హెచ్‌సీసీబీ) సంస్థ రూ.1000 కోట్లతో భారీ ప్రాజెక్టును రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. 
 
సిద్దిపేట జిల్లా బండ తిమ్మాపూర్‌ ఫుడ్‌ప్రాసెసింగ్‌ పార్క్‌లో రెండో మాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ను నెలకొల్పనుంది ఈ సంస్థ. మొదటి విడుతలో భాగంగా రూ.600 కోట్లను రానున్న రెండేళ్లలో ఖర్చు చేయనున్నట్లు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. 
 
ఈ మేరకు గురువారం తాజ్ కృష్ణ హోటల్ లో నిర్వహించిన కార్యక్రమానికి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 
 
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. తెలంగాణలో హెచ్‌సీసీబీ రెండో యూనిట్‌ ప్రారంభించనుండడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ నూతన ఫ్యాక్టరీతో 300 మంది నిరుద్యోగులకు నేరుగా ఉపాధి లభించనుందని వివరించారు.