సంబంధిత వార్తలు
- ప్రోటోకాల్ గురించి సీఎస్కు తెలియదా.. ఇగో మనిషిని కాదు : గవర్నర్ తమిళిసై
- తెలంగాణ గవర్నర్ తమిళసైని రాష్ట్రపతి పదవి వరించనున్నదా? ప్రధాని ఏం చెప్పారు?
- ప్రధాని మోదీతో జగన్ భేటీ.. నిర్మలా సీతారామన్ ఏమన్నారంటే?
- తెలుగు రాష్ట్రాల్లో మరో 15 రోజులు భగభగలే...
- 15 రోజులు భానుడు భగ్గుమంటాడు.. తెలుగు రాష్ట్రాలకు ఐఎండి
ఒక్కపూట బడుల సమయాన్ని పెంచిన తెలంగాణ సర్కారు
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో ఒక్కపూట బడులు నడుస్తున్నాయి. అయితే, ఈ బడుల సమయాన్ని తొలుత తెలంగాణ ప్రభుత్వం తగ్గించింది. ఈ ఒక్కపూట బడులు ప్రారంభమైనప్పటి నుంచి ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 11.30 గంటల వరకు స్కూల్స్ నడిచాయి.
ఇపుడు మళ్లీ ఈ సమయాన్ని పెంచారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు అంటే గంట సమయాన్ని అదనంగా పెంచారు. ఈ మేరు బుధవారం రాత్రి రాష్ట్ర విద్యా శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఈ దీంతో గురువారం నుంచి ఒక్కపూట బడులు మధ్యాహ్నం 12.30 గంటల వరకు కొనసాగనున్నాయి.
తర్వాతి కథనం