1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 22 ఆగస్టు 2022 (22:44 IST)

మనిషికి సిగ్గుండాలి.. ఛి..ఛి.. వీళ్ళా తెలుగు ఆత్మగౌరవాన్ని కాపాడేది..? (video)

తెలుగు జాతి నినాదం ఆత్మగౌరవంతో బతకడం. ఎవరికీ గులాం గిరీ చేయొద్దు. ఇదే నినాదంతో పార్టీలు ఆవిర్భవించిన సంగతి తెలిసిందే. ఢిల్లీకి సలాం చేసే పరిస్థితి ఉండొద్దు అంటారు. కానీ నిన్న అమిత్ షాకు బండి సంజయ్ చెప్పులు అందించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో తిరుగుతుంది. దీంతో బీజేపీ- టీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్ జరుగుతుంది. వీళ్లా తెలుగువారీ ఆత్మగౌరవాన్ని కాపాడేది అని ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు. 
 
సిగ్గుండాలి అంటూ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. జస్ట్ ఆస్కింగ్ పేరుతో బీజేపీపై ప్రకాశ్ రాజ్ నిప్పులు చెరుగుతున్న సంగతి తెలిసిందే. అంతేగాకుండా ఈ ట్వీట్‌కు బండి సంజయ్ చెప్పులు ఇస్తోన్న వీడియో యాడ్ చేశారు. ఛీ ఛీ అంటూ తనదైనశైలిలో ప్రకాశ్ రాజ్ ఫైరయ్యారు. 
 
దీనిపై బండి సంజయ్ స్పందించారు. కుటుంబంలో పెద్దలకు చెప్పులు అందించడం భారతీయతను పాటించే మాకు అలవాటు. మా కుటుంబ పెద్ద, గురుతుల్యుడు వంటి కేంద్ర హోమంత్రికి వయసులో చిన్నవాడినైన నేను చెప్పులు అందించడం గులామ్ గిరీ అవుతుందా? అంటూ బండి సంజయ్ ప్రశ్నించారు.  
 
"మేం పాదరక్షలు మాత్రమే గౌరవంతో అందిస్తాం. మీలాగా అవసరాలు తీరాక పాదాలు పట్టి లాగేసే అలవాటు మాకు లేదు. మేం గులామ్ లం కాదు.. మీలాగా మజ్లిస్ కు సలాం కొట్టే రజాకార్ల వారసులం అసలే కాదు" అంటూ బండి సంజయ్ స్పష్టం చేశారు.